60 శాతం మంది ఆక్సిజన్ పడకలపైనే..
కరోనా దెబ్బకు ప్రాణవాయువు కోసం పాకులాడాల్సిన పరిస్థితులు తలెత్తాయి. కరోనా రెండో దశలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. వ్యాధి ప్రభావం అధికంగా ఉండి నేరుగా ఊపిరితిత్తులపై దాడి చేస్తుండటంతో, ఊపిరాడక బాధితులు ప్రాణవాయువు కోసం కొట్టుమిట్టాడుతున్నారు....
ప్రాణవాయువు కొరతతో అల్లాడుతున్న రోగులు
ఇంటర్నెట్ డెస్క్: కరోనా దెబ్బకు ప్రాణవాయువు కోసం పాకులాడాల్సిన పరిస్థితులు తలెత్తాయి. కరోనా రెండో దశలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. వ్యాధి ప్రభావం అధికంగా ఉండి నేరుగా ఊపిరితిత్తులపై దాడి చేస్తుండటంతో, ఊపిరాడక బాధితులు ప్రాణవాయువు కోసం కొట్టుమిట్టాడుతున్నారు. కొవిడ్ సెకండ్ వేవ్లో వ్యాధి బారిన పడుతున్న వారిలో దాదాపు 60 నుంచి 70 శాతం మందికి ఆక్సిజన్ అవసరమవుతోంది. బాధితుల్లో ఆక్సిజన్ సాచ్యురేషన్ 94 శాతం కన్నా తక్కువగా ఉన్నప్పుడు బయటినుంచి కృత్రిమ ఆక్సిజన్ అందించాల్సి ఉంటుంది.
గతంలో కన్నా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటం.. ఊపిరితిత్తులకు నేరుగా నష్టం కలిగిస్తుండటంతో ఆక్సిజన్ అవసరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీర్ఘకాలిక జబ్బులు ఉన్నవారికి మహమ్మారి సోకగానే ఊపిరితిత్తులు దెబ్బతినడంతో వారు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. వైరస్ ఊపిరితిత్తుల్లోకి చేరి ఆయాసం రావడంతో బాధితులకు ఆక్సిజన్ ఇవ్వాల్సిన అవసరం పెరుగుతోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో కేవలం దానికోసమే ప్రభుత్వాసుత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య పెరుగుతోంది.
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో గురువారం రాత్రి వరకు 700 మందికి పైగా బాధితులు చికిత్స పొందుతుండగా వీరిలో 90 శాతం మందికి ఆక్సిజన్ అందిస్తున్నారు. మరో 40 మంది ప్రాణవాయువు కోసం ఎదురుచూస్తున్నారు. గుంటూరు జీజీహెచ్లో 720 మంది కరోనా రోగులు ఉండగా వీరిలో 130 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వారితోపాటు మరో 500 మందికి ఆక్సిజన్ పెడుతున్నారు. విశాఖ కేజీహెచ్లో ఐసీయూలో 300 మంది, ప్రాణవాయువు అందించే పడకలపై మరో 1000 మంది ఉన్నారు. అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో 622 మంది చికిత్స పొందుతుండగా.. ఐసీయూలో 61 మంది, ఆక్సిజన్ పడకలపై 368 మంది ఉన్నారు. ఒంగోలు రిమ్స్లోని 800 మందిలో 100 మంది ఐసీయూలోనూ మరో 320 మంది ఆక్సిజన్ పడకలపైనే చికిత్స పొందుతున్నారు.
మలిదశలో వైరస్ ఉద్ధృతంగా ఉండటంతో చాలా మందిలో లక్షణాలు ఉన్నా.. సకాలంలో పరీక్షలు చేయించుకోకపోవడం, వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత కూడా సమయానికి వైద్యులను సంప్రదించకపోవడం వల్లే ప్రాణవాయువు అవసరాలు పెరుగుతున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. గతంలో కన్నా ఈసారి యువకులకు ఆక్సిజన్ అవసరం ఎక్కువగా ఉంటోందని అంటున్నారు. ఊపిరి అందని పరిస్థితుల్లో ఆక్సిజన్ కోసం ప్రైవేటు ఆస్పత్రుల చుట్టూ తిరిగి చివరకు ప్రభుత్వ ఆసుపత్రులకు చేరుకుంటున్నారని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?