Ukraine Crisis: కాపాడండి ప్లీజ్.. ఉక్రెయిన్లో తెలుగు విద్యార్థుల ఆవేదన
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు అక్కడ బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. తమను సురక్షితంగా భారత్కు రప్పించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. ఉక్రెయిన్లో...న
సొలొమ్ యాన్స్ కీ: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు అక్కడ బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. తమను సురక్షితంగా భారత్కు రప్పించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. ఉక్రెయిన్లోని సొలొమ్ యాన్స్ కీ నగరంలో కొందరు తెలుగు విద్యార్థులు తీవ్ర కష్టాలు పడుతున్నారు. మెడిసిన్ చదువుతన్న వైద్య విద్యార్థులు భవానీ, సాయి, నికిత.. వారు పడుతున్న ఇబ్బందులను ఈనాడు-ఈటీవీకి వివరించారు.
‘‘నేను కీవ్లో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నా. ఇక్కడ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. ఉదయం నుంచి బాంబుల శబ్దాలు, అంబులెన్స్ శబ్దాలు వినబడుతున్నాయి. భయంగా ఉంది. సరకుల కోసం బయటకు వెళ్లాలన్నా చాలా భయం వేస్తోంది. భారత్ నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి. ఇక్కడి ఎంబసీ వారు మాత్రం ఇంకా సమాచారం ఇవ్వలేదు. బయటకు వెళ్లలేకపోతున్నాం. ఇక్కడ ఏటీఎంలలో డబ్బులు రావడం లేదు. పవర్ కట్ ఉంది. దీంతో నెట్ రావడంలేదు. ఇక్కడ మేం ఓ ప్లాట్లో ఐదుగురం ఉన్నాం. వేరేచోట ఫ్రెండ్స్ ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావడంలేదు.
ఉక్రెయిన్కు దేశానికి చెందిన వారు వారి సొంత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. మా తల్లిదండ్రులు భారత్ నుంచి ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. ధైర్యంగా ఉండాలని.. ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని చెబుతున్నారు. ఇక్కడ ఐదుగురం ఉన్నాం. యూనివర్సిటీ నుంచి మాకు ఎలాంటి సమాచారం రావడం లేదు. మా భద్రత విషయంలో ఎవరి నుంచి ఎలాంటి సహాయం అందుడం లేదు. విమానాలు రద్దు చేయడంతో ఎటూ వెళ్లలేని స్థితిలో భయపడుతూ గడుపుతున్నాం. ఎంబసీ నుంచి కూడా ఎలాంటి సమాచారం రావడం లేదు. మమ్మల్ని ఇక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. నా స్నేహితులు దాదాపు 40 మంది వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు’’ అని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
-
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
-
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది నేవీ సిబ్బంది మృతి
-
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
-
ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 పైన నిఫ్టీ