
Published : 18 Jun 2021 14:41 IST
స్విస్ బ్యాంకుల్లో భారీగా పెరిగిన భారతీయుల సంపద
ఇంటర్నెట్ డెస్క్: స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న సంపద మరోసారి భారీగా పెరిగినట్లు ఆ దేశ జాతీయ బ్యాంకు ఎస్ఎన్బీ పేర్కొంది. దాదాపు 20 వేల 700 కోట్ల రూపాయలు స్విట్జర్లాండ్ల్లోని బ్యాంకుల్లో దాచుకున్నట్లు వెల్లడించింది. 2019లో 6 వేల625 కోట్ల రూపాయలుగా ఉన్న భారతీయుల సంపద ఆమాంతం పెరిగినట్లు వివరించింది. 2011 తర్వాత మళ్లీ ఈ స్థాయిలో పెరగటం ఇదే తొలిసారి అని స్పష్టం చేసింది. భారతీయులు దాచుకున్న సంపద అత్యధికంగా 2006లో 6.5 బిలియన్ స్విస్ ఫ్రాన్సులుగా ఉన్నట్లు తెలిపింది.
ఇవీ చదవండి
Tags :