కొబ్బరికాయలు.. ఆకులే కాలేజీ ఫీజులు!
పూర్వం విద్యాబుద్ధులు నేర్పించిన గురువులకు విద్యార్థులు పండ్లు, ఫలహారాలు ఇతర వస్తువులను గురుదక్షిణగా ఇచ్చేవారట. ఆ కాలంలో నగదు లావాదేవీలు లేవు కావు కాబట్టి.. విద్యార్థులు తమకు తోచిన వస్తువుల్ని ఫీజు కింద ఇచ్చారు. ఇప్పటి పాఠశాలలు, కళాశాలలు రూ.లక్షలు ఫీజుగా
ఇంటర్నెట్ డెస్క్: పూర్వం విద్యాబుద్ధులు నేర్పించిన గురువులకు విద్యార్థులు పండ్లు, ఫలహారాలు, ఇతర వస్తువులను గురుదక్షిణగా ఇచ్చేవారు. ఆ కాలంలో నగదు లావాదేవీలు లేవు కావు కాబట్టి.. విద్యార్థులు తమకు తోచిన వస్తువుల్ని గురుభక్తితో సమర్పించే వారు. కానీ ఇప్పటి పాఠశాలలు, కళాశాలలు రూ.లక్షలు ఫీజుగా తీసుకుంటున్నాయి. కరోనా కాలంలో ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నా.. ఫీజు కడితేనే పాఠాలు చెబుతామని తెగేసి చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. కానీ, ఇండోనేషియాలోని ఓ కాలేజీ మాత్రం మాకు డబ్బులొద్దు.. కొబ్బరికాయలు, చెట్ల ఆకుల్నే ఫీజుగా ఇవ్వండి చాలు అంటోంది. ఇదేం విచిత్రం అనుకుంటున్నారా? అయితే వివరంగా చదవండి.
బాలిలోని ‘వీనస్ వన్ టూరిజం అకాడమీ’ పర్యటకరంగానికి సంబంధించిన కోర్సును అందిస్తోంది. ఇండోనేషియా ఆర్థిక వ్యవస్థలో పర్యటకరంగానిది ముఖ్య పాత్ర. అందుకే ఈ రంగంలో ఉద్యోగాల కోసం చాలా మంది ఈ కోర్సులు చేస్తుంటారు. అయితే, కరోనా కారణంగా ఇటీవల ఆ దేశంలోని ప్రజలు ఆర్థిక కష్టాలను చవిచూడాల్సి వచ్చింది. కుటుంబాలు ఆదాయం కోల్పోయి.. తమ పిల్లల చదువుల నిమిత్తం ఫీజు కట్టలేని పరిస్థితులకి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో తమ విద్యార్థుల ఆర్థిక పరిస్థితులను గమనించిన వీనస్ వన్ కాలేజీ.. వినూత్న ఆలోచన చేసింది. విద్యార్థులు బోధన ఫీజు కింద కొబ్బరికాయలు, ఆయుర్వేదంలో ఉపయోగపడే గోటు కొలా, మొరింగా చెట్ల ఆకులను తెచ్చివ్వాలని కోరింది. నిజానికి కొబ్బరికాయల్ని గత మార్చి నుంచే స్వీకరిస్తోంది. కానీ, తాజాగా కొబ్బరికాయలతోపాటు ఆకుల్నీ ఫీజుగా తీసుకోవడం విశేషం.
వీనస్ వన్ ఇటీవల కాలేజీ ప్రాంగణంలోనే వర్జిన్ కొకొనట్ ఆయిల్ (వీసీఓ)ను ఉత్పత్తి చేయడం కోసం ఓ పరిశ్రమని ఏర్పాటు చేసింది. ఈ ఆయుర్వేద నూనెతో పాటూ సబ్బుల వంటివీ తయారు చేస్తోంది. వీటిని తయారు చేయాలంటే కొబ్బరికాయలు, ఔషధ చెట్ల ఆకులు కావాలి. అందుకే వీటినే విద్యార్థులతో తెప్పించుకుంటూ ఫీజు కింద జమ చేసుకుంటోంది. కాలేజీ ఉత్పత్తి చేసిన వస్తువుల్ని విద్యార్థులతోనే విక్రయించి వారిలోని వ్యాపార నైపుణ్యాల్ని వెలికితీసే ప్రయత్నం చేస్తామని యాజమాన్యం అంటోంది. అంతేకాదు, ఈ పద్ధతి ద్వారా విద్యార్థులకు తమ చుట్టూ ఉండే సహజ వనరులను ఎలా వినియోగించుకోవచ్చో తెలుస్తుందని చెబుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు 30 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్లో చేరతా.. సీఎంకు తెలిపిన భారాస ఎమ్మెల్యే!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్