ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు.. చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తెదేపా అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది.
అమరావతి: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తెదేపా అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. రాజధాని నగరానికి సంబంధించిన బృహత్ ప్రణాళిక డిజైనింగ్, ఇన్నర్ రింగ్ రోడ్డు, దాన్ని అనుసంధానించే రహదారుల అలైన్మెంట్ వ్యవహారంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 2022 ఏప్రిల్ 27న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా.. అదే ఏడాది మే 9న సీఐడీ పలువురిపై కేసు నమోదు చేసింది.
చంద్రబాబును మొదటి నిందితుడిగా సీఐడీ పేర్కొంది. ఈ కేసులో తనకు బెయిలు మంజూరు చేయాలని హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ వేశారు. కేసులోని ఇతర నిందితులకు బెయిల్ వచ్చిందని చంద్రబాబు తరఫున న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకుకెళ్లారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణ ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.