Telangana News: ఎట్టకేలకు తెలంగాణ కేడర్లోకి ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతి
ఎట్టకేలకు ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతికి ఊరట లభించింది. ఆయన్ను తెలంగాణ కేడర్లోకి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న జీవో 583 జారీ చేసినట్టు తెలంగాణఎట్టకేలకు ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతికి ఊరట లభించింది. ఆయన్ను తెలంగాణ కేడర్లోకి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న జీవో 583 జారీ చేసినట్టు
హైదరాబాద్: ఎట్టకేలకు ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతికి ఊరట లభించింది. ఆయన్ను తెలంగాణ కేడర్లోకి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న జీవో 583 జారీ చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. అఖిల భారత సర్వీసు అధికారుల విభజనలో భాగంగా అభిషేక్ మహంతిని కేంద్రం ఆంధ్రప్రదేశ్కు కేటాయించింది. ఏపీకి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ను ఆశ్రయించిన అభిషేక్... తనను తెలంగాణకు కేటాయించాలని కోరారు.
వాదనలు విన్న క్యాట్.. అభిషేక్ మొహంతిని తెలగాణకు కేటాయించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అభిషేక్ మహంతిని విధుల నుంచి రిలీవ్ చేయాలని ఏపీని, విధుల్లో చేర్చుకోవాలని తెలంగాణను ఆదేశించింది. ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేసినప్పటికీ.. తెలంగాణ ప్రభుత్వం ఆయన్ను విధుల్లోకి తీసుకోలేదు. దీంతో తెలంగాణ సీఎస్పై అభిషేక్ మహంతి ట్రైబ్యునల్లో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. సీఎస్ తీరుపై ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రైబ్యునల్.. ఇవాళ వ్యక్తిగతంగా హాజరుకావాలని సీఎస్ను ఆదేశించింది. క్యాట్ విచారణ నిలిపివేయాలని సోమేశ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు.. అభిషేక్ మహంతిని ఎందుకు విధుల్లోకి తీసుకోవడం లేదని ప్రశ్నిస్తూ క్యాట్ ఆదేశాలు ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని స్పష్టం చేసింది. ఇవాళ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. అభిషేక్ మొహంతిని విధుల్లోకి తీసుకుంటూ జీవో జారీ చేసినట్టు అడ్వొకేట్ జనరల్ తెలిపారు. దీంతో ఇవాళ సోమేశ్ కుమార్ వ్యక్తిగతంగా హాజరుకావాలన్న క్యాట్ ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం