IPS అధికారి జిలేబీ ట్వీట్ వైరల్!
జిలేబీ అంటే ఇష్టం ఉన్న ఓ పోలీసు ఉన్నతాధికారి చేసిన ట్వీట్ నెట్టింట్లో నవ్వులు పూయిస్తోంది. తమిళనాడుకు చెందిన డా.సందీప్ మిత్తల్ అనే ఐపీఎస్ అధికారి తనకు............
ఇంటర్నెట్ డెస్క్: జిలేబీ అంటే ఇష్టం ఉన్న ఓ పోలీసు ఉన్నతాధికారి చేసిన ట్వీట్ నెట్టింట్లో నవ్వులు పూయిస్తోంది. తమిళనాడుకు చెందిన డా.సందీప్ మిత్తల్ అనే ఐపీఎస్ అధికారి తనకు జిలేబీ తినాలి అనిపిస్తోందనీ, కానీ తన భార్య తిననివ్వడం లేదంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కాస్తా ఆయన భార్య వరకూ వెళ్లింది. ఆమె ‘‘మీరు ఈరోజు ఇంటికి రండి’’ అని రిప్లై ఇచ్చారు. మరి ఇంటికి వెళ్లాక ఆయన జిలేబీ తిన్నారో?లేదో? తెలియదు కానీ ఆ ట్వీట్లు మాత్రం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
‘‘చిన్నప్పుడు 25 పైసలకు పెద్ద జిలేబీ వచ్చేది. పెద్దయ్యాక డబ్బు సంపాదించి అలాంటి జిలేబీలు రోజుకు మూడు లేదా నాలుగు తినొచ్చు అనుకున్నా. ఇప్పుడు నేను డబ్బు సంపాదిస్తున్నా.. కానీ, నా భార్య నన్ను జిలేబీ తిననివ్వడం లేదు’’ అని సదరు ఐపీఎస్ అధికారి ట్వీట్ చేయగా.. ‘‘మీరు ఈరోజు ఇంటికి రండి’’ అని ఆయన భార్య డా. రిచా మిత్తల్ రిప్లై ఇచ్చారు. ఈ ట్వీట్లకు నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?