కోరిన చోటికి.. కోరినట్లుగా..
పర్యాటకం కొత్త పుంతలు తొక్కుతోంది. గతంలో టూరిజం సంస్థలు యాత్రలు నిర్ణయించేవి..
ఐఆర్సీటీసీ, టీఎస్ టీడీసీ ప్రత్యేక యాత్రలు
హైదరాబాద్: పర్యాటకం కొత్త పుంతలు తొక్కుతోంది. గతంలో టూరిజం సంస్థలు యాత్రలు నిర్ణయించేవి.. ఇప్పుడు పర్యాటకులే ఎక్కడకు వెళ్లాలి.. ఎన్ని రోజులుండాలి.. ఎప్పుడు తిరిగి రావాలనేది నిర్దేశిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఐఆర్సీటీసీతో పాటు.. ఆయా రాష్ట్రాల పర్యాటక సంస్థలు, ప్రైవేటు టూరు ఆపరేటర్లు యాత్రలు తిరిగి రాస్తున్నారు. కరోనా వేళ మాస్గా వెళ్లేందుకు ఇష్టపడని కొంతమంది కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రులతో యాత్రలను రూపొందిస్తున్నారు. పర్యాటకుల ఇష్టాల మేరకు వారికి రవాణా సౌకర్యం, వసతి, భోజన ఏర్పాటు చూడడంలో ఇప్పుడు పర్యాటక సంస్థలు నిమగ్నమయ్యాయి.
పర్యాటకమంతా విమానయానం
ఐఆర్సీటీసీ(ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) నిర్వహిస్తున్న విమాన పర్యాటక యాత్రలకు నగర ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. రకరకాల పేర్లతో రూపొందించిన 8 రకాల యాత్రలు ఆదరణకు నోచుకున్నాయి. మ్యాజికల్ మేఘాలయ, హెరిటేజ్ హంపి, మధ్యప్రదేశ్ మహాదర్శన్, అమేజింగ్ అండమాన్, కాశ్మీర్ యాత్ర, గంగారామాయణ్ యాత్ర, సౌరాష్ట్ర యాత్ర, మ్యాగ్నఫిసియంట్ మధ్యప్రదేశ్ యాత్రలను ఐఆర్సీటీసీ రూపొందించింది. విమానంలో వెళ్లడం.. తిరిగి విమానంలో రావడం.. స్థానికంగా కరోనా జాగ్రత్తలతో రోడ్డు ప్రయాణం, వసతి, భోజనం ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో నగరం నుంచి ప్రతి యాత్రకు 70 మందికి తక్కువ లేకుండా వెళ్లారు. ఇవే కాకుండా.. ఎవరైనా 20 మంది సొంతంగా ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే.. అందుకు యాత్రలను కూడా రూపొందిస్తామని ఐఆర్సీటీసీ ప్రకటించింది. ఎల్టీసీ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. www.com.-ir-ctc.-com వెబ్సైట్లో టిక్కెట్ ధరలతో పాటు.. మరింత సమాచారం అందుబాటులో ఉంటుంది. అలాగే : 04027702401/ 07, 27808899 నంబర్లలో కూడా సంప్రదించవచ్చు.
టీఎస్టీడీసీతో పాటు ఆర్టీసీ..
తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ నిత్యం నగర సందర్శనతో పాటు.. హెరిటేజ్ యాత్రలనూ చేపడుతోంది. ఇటీవల షిరిడీ యాత్రలను ప్రారంభించింది. పంచారామాలకూ తీసుకెళ్లింది. త్వరలో తిరుపతి యాత్రను కూడా ప్రారంభించనుంది. నాగార్జునసాగర్, శ్రీశైలం మధ్య బోటు షికారులను రూపొందించింది. ఇన్నోవా కారు నుంచి మినీ బస్సు వరకూ సరిపడేంతమందితో యాత్రలకు తీసుకెళ్లేందుకు సిద్ధమని ప్రకటించింది. .
* పర్యాటకుల ఆకాంక్షల మేరకు ప్రణాళికలు
* ఐఆర్సీటీసీ, టీఎస్టీడీసీ ప్రత్యేక యాత్రలు
పూర్తి వివరాలకు 180042546464 టోల్ ఫ్రీ నంబరుతో పాటు.. 9848540371, 9848125720, 9848306435 నంబర్లలో సంప్రదించాలని పర్యాటకాభివృద్ధి సంస్త సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!