ఈ దీవిని మీరూ కొనుక్కోవచ్చు!
చుట్టూ నీరు.. మధ్యలో మీరు.. ఇల్లు కట్టుకుని ఎంచక్కా ప్రకృతి ఒడిలో సేదదీరాలని అనుకుంటున్నారా! అయితే దానికి ఏ దీవో కావాలి. మరి అలాంటి అవకాశం ఉందంటారా........
ఇంటర్నెట్డెస్క్: చుట్టూ నీరు.. మధ్యలో మీరు.. ఇల్లు కట్టుకుని ఎంచక్కా ప్రకృతి ఒడిలో సేదదీరాలని అనుకుంటున్నారా! అయితే దానికి ఏ దీవో కావాలి. మరి అలాంటి అవకాశం ఉందంటారా! ఇదిగో ఈ దీవిని అమ్ముతున్నారట. అదేంటో చూద్దాం రండి..
స్కాట్లాండ్కు చెందిన హైలాండ్లో 11 ఎకరాల దీవి ఉంది. దీన్ని ‘డీర్’ ఐలాండ్ అనీ, ‘ఈలీన్ ఏన్ ఎఫెయిద్’ అనీ పిలుస్తారు. అయితే ఈ ‘డీర్ ఐలాండ్’ చుట్టు పక్కల ఇళ్లులేవు. మనుషులు కూడా సంచరించరు. అలాగనీ దీన్నిప్పుడు వదిలేస్తే, ఇక జీవితంలో కొనలేరని దీన్ని అమ్మే ఏజెంట్లు చెబుతున్నారు. అందుకే ప్యూచర్ ప్రాపర్టీ కింద ఈ దీవిని ఇప్పుడే సొంతం చేసుకోమని సలహా ఇస్తున్నారు. కానీ అంత తక్కువకి ఎందుకు అమ్ముతున్నారు? అని సందేహపడుతున్నారా?
ఇంతకీ అసలు సంగతేంటంటే ఈ ఐలాండ్.. ఒకప్పుడు మొయిడార్ట్ రాజవంశానికి చెందిన క్లారానాల్డ్ అధీనంలో ఉండేదట. కానీ ప్రస్తుతానికి దీనికి యజమానులెవరూ లేరట. అందుకే అక్కడి ఏజెంట్లు దీన్ని వేలం వేయాలని నిర్ణయించుకున్నారు. మార్చి 26న ఈ దీవిని 80 లక్షల రూపాయల (80 వేల పౌండ్లు) ప్రారంభ విలువతో వేలం పాట నిర్వహిస్తారు. అయితే బిలియనీర్లకి ఈ మొత్తం పెద్ద ఎక్కువేం కాదనుకోండి. అంతేకాక ఇలాంటి దీవిని సొంతం చేసుకోవడానికి ఎంతయినా ఖర్చు పెడతారు. కాబట్టి దీన్ని ఎవరు దక్కించుకుంటారో తెలియాలంటే ఇంకో 3 రోజులు వేచి చూడాలి. మరి మీకూ ఆ దీవిని చూడాలనుంటే జర ఓ లుక్కేయండి!!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!