Hyderabad: ఎక్సెల్‌ గ్రూప్‌ సంస్థల్లో ఐటీ సోదాలు

నగరంలోని పలుచోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి. సుమారు  60 మంది ఐటీ సిబ్బంది 20 బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్నారు.

Published : 04 Jan 2023 11:22 IST

హైదరాబాద్‌: నగరంలోని పలుచోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి. సుమారు  60 మంది ఐటీ సిబ్బంది 20 బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్నారు. ప్రధానంగా ఎక్సెల్‌ గ్రూప్‌ సంస్థల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఇన్ఫ్రా, ఐటీ, ఇంజినీరింగ్, హెల్త్ కేర్ గ్రూపు కంపెనీలను ఎక్సెల్‌ సంస్థ నడుపుతోంది. తనిఖీల్లో భాగంగా గచ్చిబౌలిలోని ఎక్సెల్‌ కార్యాలయంతో పాటు బాచుపల్లి, చందానగర్‌, బొల్లారం తదితర ప్రాంతాల్లో అనుబంధ సంస్థల్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేసి వివిధ పత్రాలు పరిశీలిస్తున్నారు. ఆదాయపన్ను చెల్లింపుల్లో తేడాలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని