Hyderabad: రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలపై ఐటీ దాడులు

నగరంలోని పలు రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలపై ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. వండర్‌ సిటీ, రాయల్‌ సిటీ సహా పలు రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలపై దాడులు కొనసాగుతున్నాయి.

Updated : 28 Feb 2023 12:39 IST

హైదరాబాద్‌: నగరంలోని పలు రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలపై ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. వండర్‌ సిటీ, రాయల్‌ సిటీ సహా పలు రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలపై దాడులు కొనసాగుతున్నాయి. ఆయా కార్యాలయాలతో పాటు డైరెక్టర్ల నివాసాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేశారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని గూగి రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ప్రధాన కార్యాలయంపై దాడులు చేసి వివిధ పత్రాలను పరిశీలిస్తున్నారు. పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసం ఉండటంతో ఐటీ అధికారులు కేసు నమోదు చేసి సోదాలు చేపట్టారు. ఈ దాడుల్లో సుమారు 20 ఐటీ బృందాలు పాల్గొన్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని