ఈవోగా బాధ్యతలు చేపట్టిన జవహర్‌రెడ్డి 

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా జవహర్‌రెడ్డి శనివారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు.

Updated : 10 Oct 2020 14:02 IST


తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా జవహర్‌రెడ్డి శనివారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం 6గంటలకు అలిపిరి పాదాల మండపం వద్ద నుంచి కాలినడకన కొండపైకి చేరుకున్నారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ ద్వారా ఆలయంలోకి చేరుకుని కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో తితిదే ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జవహర్‌రెడ్డికి వేదపండితులు ఆశీర్వచనం అందించారు. ఆ తర్వాత అన్నమయ్య భవన్‌లో తితిదే ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

ఇంతకు ముందు తితిదే ఈవోగా ఉన్న అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ను రాష్ట్ర ప్రభుత్వం వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేసిన విషయం తెలిసిందే. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని