JEE Main 2023: ఇంకా 3రోజులే.. జేఈఈ మెయిన్ పరీక్షకు దరఖాస్తు చేశారా?
విద్యార్థులకు అలర్ట్.. జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్ష రిజిస్ట్రేషన్లకు ఇంకా మూడు రోజులే గడువు ఉంది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 12న రాత్రి 9గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ (JEE Main 2023) పరీక్షలకు సమయం దగ్గరపడుతోంది. లక్షలాది మంది విద్యార్థులు పోటీ పడే జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్ష(JEE main session 1 exam) జనవరి 24 నుంచి 31వరకు జరగనున్న విషయం తెలిసిందే. అయితే, ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకొనేందుకు గడువు త్వరలోనే ముగియనుంది. ఈ నెల 12న రాత్రి 9గంటల వరకు మాత్రమే విద్యార్థులు దరఖాస్తులు చేసుకొనేందుకు అవకాశం ఉండగా.. దరఖాస్తు రుసుము మాత్రం అదేరోజు రాత్రి 11.50గంటల వరకు చెల్లించేందుకు ఎన్టీఏ అధికారులు అవకాశం కల్పించారు. పరీక్ష కేంద్రాలు ఏయే నగరాల్లో నిర్వహిస్తారనే విషయాన్ని ఈ వారంలోనే వెల్లడించనుండగా.. అడ్మిట్ కార్డులను మాత్రం వచ్చే వారం నుంచి డౌన్లోడ్ చేసుకొనేందుకు అందుబాటులో ఉంచనున్నారు. అయితే, ఇవి ఈ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయనే విషయాలను మాత్రం అధికారులు ఇంకా వెల్లడించలేదు.
మరోవైపు, జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్ష కోసం విద్యార్థులు ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఎన్టీఏ ఇప్పటికే ప్రకటించింది. రెండో విడత పరీక్ష(JEE main session 2 exam) ఏప్రిల్ 6నుంచి 12వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్ష నిర్వహించే నగరాల జాబితాను మార్చి మూడో వారంలో; అడ్మిట్ కార్డులను మార్చి చివరి వారం నుంచి అందుబాటులో ఉంచనున్నారు.
తొలి విడత పరీక్షకు దరఖాస్తు గడువు మరో మూడు రోజుల్లో ముగియనుండటంతో ఇప్పటికే రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకోని విద్యార్థులు ఇలా దరఖాస్తు చేసుకోండి.
- తొలుత అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.inను సందర్శించండి.
- జేఈఈ మెయిన్ 2023 అప్లికేషన్ లింక్పై క్లిక్ చేయండి
- అవసరమైన వివరాలను నమోదు చేయడం ద్వారా రిజిస్టర్ అవ్వండి
- పరీక్ష ఫీజు చెల్లించి దరఖాస్తును సమర్పించండి
- ఆ దరఖాస్తును డౌన్లోడ్చేసి భవిష్యత్తు అవసరాల కోసం ఆ కాపీని మీ వద్దే ఉంచుకోండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. -
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
వైకాపా ప్రచారరథం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారారు. -
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేశాం: రంగరాజన్
హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేసినట్టు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి