Gold: బంగారు కలలన్నీ శ్రావణంపైనే..!
బంగారం వ్యాపారంపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. గతేడాది నుంచి పసిడి ఒడిదొడకులు ఎదుర్కొంటోంది. పండగలు, పెళ్లిళ్ల సందడి తగ్గడంతో పుత్తడి అమ్మకాలు తగ్గిపోయాయి....
ఇంటర్నెట్ డెస్క్: బంగారం వ్యాపారంపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. గతేడాది నుంచి పసిడి ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. పండగలు, పెళ్లిళ్ల సందడి తగ్గడంతో పుత్తడి అమ్మకాలు తగ్గిపోయాయి. కొవిడ్ కేసులు కొంత తగ్గుముఖం పట్టినా.. వ్యాపారం పూర్తిగా పుంజుకోవడం లేదు. శ్రావణ మాసం నుంచైనా కలిసి వస్తుందనే అంచనా వేస్తున్న బంగారం వ్యాపారులు కొండంత ఆశలతో ఎదురు చూస్తున్నారు.
పెళ్లిళ్లు.. పేరంటాలు.. పండగలు.. వేడుకలు.. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ముందు ఆడవాళ్ల మదిలో మెదిలేది బంగారమే. రేటు ఎంత పెరిగినా బడ్జెట్ను బట్టి పసిడిని కొనుగోలు చేస్తుంటారు. కొవిడ్ కారణంగా బంగారం వ్యాపారం ఆశాజనకంగా సాగడంలేదు. విక్రయాలు బాగా పడిపోవడంతో వినియోగదారులను ఆకర్షించేందుకు ఆఫర్లతోపాటు సరికొత్త డిజైన్లను అందుబాటులోకి తెస్తున్నారు. కొవిడ్ కొంత అదుపులోకి రావడంతో వాయిదా పడుతూ వస్తున్న కొత్త షోరూంల ప్రారంభోత్సవాలను ముమ్మరం చేస్తున్నారు.
బంగారం కొనుగోలు చేసే అతివలు హెవీ లుక్తోపాటు తక్కువ బడ్జెట్ ఉండే కలెక్షన్ వైపు మొగ్గుచూపుతుండటంతో.. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా దుకాణాదారులు ఆభరణాలను రూపొందిస్తున్నారు. టెంపుల్ జ్యువెలరీ, ఖరీదైన స్టోన్ జ్యువెలరీ, మైన్ రేర్ డైమండ్, ఎరాకుండన్ జ్యువెలరీ, జెవెల్ కలెక్షన్ పేరుతో 18 క్యారెట్ల బంగారు ఆభరణాలను అందుబాటులోకి తెస్తున్నారు. వినియోగదారులను ఆకట్టుకునేలా ఆఫర్లతోపాటు.. వైరస్ బారిన పడకుండా రక్షణ చర్యలు తీసుకుంటున్నామని జ్యువెలరీ వ్యాపారులు పేర్కొంటున్నారు.
లాక్డౌన్ పూర్తిగా ఎత్తేయడంతో వాయిదా పడిన వివాహాలు, వేడుకలు ఊపందుకున్నాయి. షాపింగ్ చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చాలా రోజుల తర్వాత బంగారం కొనుగోలు చేయడం ఆనందంగా ఉందని వినియోగదారులు చెబుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. బయటకు రావాలంటే భయంగానే ఉందని పేర్కొంటున్నారు. రెండేళ్లుగా కరోనాతో ఇబ్బందులు పడుతున్న జ్యువెలరీ వ్యాపారులు శ్రావణమాసం పెళ్లిళ్లు, పండగలతో మళ్లీ అమ్మకాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్ టీకాలు వేయించుకోవడంతోపాటు మార్గదర్శకాలు పాటిస్తే వైరస్ ముప్పు కొంతమేర తగ్గి కార్యకలాపాలు సాధారణంగా సాగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
రాష్ట్రంలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ