గుండెపోటుతో జేఎన్‌టీయుకే రిజిస్ట్రార్‌ మృతి

కాకినాడ జేఎన్‌టీయు రిజిస్ట్రార్‌ సీహెచ్‌ సత్యనారాయణ గుండుపోటుతో మృతి చెందారు. విధుల్లో భాగంగా సోమవారం మధ్యాహ్నం వరకు యూనివర్సీటీలోనే ఉన్న

Updated : 02 Aug 2021 17:54 IST

భానుగుడి సెంటర్‌: కాకినాడ జేఎన్‌టీయు రిజిస్ట్రార్‌ సీహెచ్‌ సత్యనారాయణ గుండుపోటుతో మృతి చెందారు. విధుల్లో భాగంగా సోమవారం మధ్యాహ్నం వరకు యూనివర్సీటీలోనే ఉన్న ఆయన.. విరామ సమయంలో భోజనం చేస్తుండగా ఛాతిలో నొప్పి మొదలైంది. దీంతో హుటాహుటిన స్థానిక అపోలో ఆస్పత్రికి వెళ్లారు. ఆసుపత్రి మెట్లు ఎక్కుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆయన స్వస్థలం కృష్ణా జిల్లా .

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని