JNU Job Recruitment: జేఎన్యూలో 388 పోస్టులకు నోటిఫికేషన్.. అర్హతలివే..!
ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయం జేఎన్యూలో బోధనేతర సిబ్బంది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 10 వరకు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు.
దిల్లీ: దేశ రాజధానిలోని ప్రతిష్ఠాత్మక జవహర్లాల్ నెహ్రూ యూనిర్సిటీ(JNU)లో నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 388 ఉద్యోగాల భర్తీకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ద్వారా పరీక్ష నిర్వహించనున్నారు. ఆయా ఉద్యోగాలను బట్టి విద్యార్హతలు నిర్ణయించారు. వర్సిటీలో డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, పీఆర్వోలు, సెక్షన్ ఆఫీసర్, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, ఆఫీస్ అటెండెంట్లు, ప్రైవేటు సెక్రటరీ, పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్లు, రీసెర్చి ఆఫీసర్, ఎడిటర్ పబ్లికేషన్, అసిస్టెంట్ లైబ్రీరియన్, ప్రొఫెషనల్ అసిస్టెంట్, సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్, కుక్, మెస్ హెల్పర్, అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్), జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్), లిఫ్ట్ ఆపరేటర్, సిస్టమ్ ఎనలిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్, టెక్నికల్ అసిస్టెంట్లు, స్టాటిస్టికల్ అసిస్టెంట్, లేబోరేటరీ అటెండెంట్, స్టాఫ్నర్స్, లేబోరేటరీ అసిస్టెంట్ సహా పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు జేఎన్యూ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
- శనివారం (ఫిబ్రవరి 18) నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. అర్హులైన అభ్యర్థులు మార్చి 10వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు.
- రాత పరీక్ష, ఆయా పోస్టులను బట్టి నైపుణ్య పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
- రాత పరీక్ష 2గంటల పాటు ఉంటుంది. 150 ప్రశ్నలకు 300 మార్కులు ఉంటాయి. జనరల్ సైన్స్(30 మార్కులు), రీజనింగ్ ఎబిలిటీ(35), మ్యాథమెటికల్ ఎబిలిటీ(35), టెస్ట్ ఆఫ్ లాంగ్వేజ్: ఇంగ్లిష్/హిందీ(30); కంప్యూటర్ అవగాహన(20) చొప్పున మార్కులు ఉంటాయి.
- ఈ ఉద్యోగ ఖాళీల వివరాలు, రిజర్వేషన్లు, పరీక్ష రుసుం, వయో పరిమితి ఇతర వివరాలన్నింటి కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
వైకాపా ప్రచారరథం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారారు. -
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు మార్గంలో భారీగా ట్రాఫిక్జామ్: వాహనాలు నిలిపి.. కి.మీ మేర నడిచి..
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM