Andhra News: ఏయూలో జాబ్‌మేళా.. రిజిస్ట్రేషన్ చేసుకున్న 77వేల మంది: విజయసాయి

ఆంధ్రా యూనివర్సిటీలో రేపటి నుంచి 860 మంది వాలంటీర్ల సహకారంతో రెండు రోజుల పాటు జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు వైకాపా ఎంపీ విజయసాయి తెలిపారు. విశాఖలో జాబ్‌మేళా బ్రోచర్‌ను ఆయన విడుదల చేశారు. ఉదయం 8 గంటల నుంచి....

Published : 22 Apr 2022 22:09 IST

విశాఖ: ఆంధ్రా యూనివర్సిటీలో రేపటి నుంచి 860 మంది వాలంటీర్ల సహకారంతో రెండు రోజుల పాటు జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు వైకాపా ఎంపీ విజయసాయి తెలిపారు. విశాఖలో జాబ్‌మేళా బ్రోచర్‌ను ఆయన విడుదల చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు చెప్పారు. జాబ్‌మేళాకు 77 వేల మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్లు విజయసాయి తెలిపారు. జాబ్‌మేళాలో 200కు పైగా కంపెనీలు పాల్గొంటాయని.. మొత్తంగా 23,935 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. దివ్యాంగుల కోసం ఎలక్ట్రిక్‌ వాహనాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎంకికైన వారికి సాయంత్రం ధ్రువీకరణ పత్రాలు అందిస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని