Hyderabad: వైభవంగా ప్రారంభమైన జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లి శాకంబరి ఉత్సవాలు

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి అమ్మవారి శాకంబరి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి 3 రోజులపాటు కొనసాగే ఉత్సవాలకు నిర్వాహకులు

Updated : 06 Jul 2022 16:34 IST

జూబ్లీహిల్స్‌: హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి అమ్మవారి శాకంబరి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి 3 రోజులపాటు కొనసాగే ఉత్సవాలకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. శాకంబరి ఉత్సవాల్లో భాగంగా దేవాలయ ప్రాంగణంలో వివిధ కూరగాయలతో అలంకరించారు. ఉత్సవాల్లో భాగంగా నిత్య అభిషేకం, అర్చన, మంత్రపుష్ప కార్యక్రమం, పల్లకీ సేవ తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఇవాళ తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో  తరలి వచ్చి పెద్దమ్మ తల్లిని దర్శించుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని