Justice NV Ramana: హైదరాబాద్‌ చేరుకున్న జస్టిస్‌ ఎన్‌.వి.రమణకు ఘనస్వాగతం

సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు.

Updated : 23 Sep 2022 11:56 IST

శంషాబాద్‌: సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. సీజేఐగా పదవీ విరమణ చేశాక ఆయన తొలిసారి హైదరాబాద్‌కు వచ్చారు. విమానాశ్రయానికి చేరుకున్న జస్టిస్‌ ఎన్‌.వి.రమణ దంపతులకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నాగార్జున, జస్టిస్ కన్నెగంటి లలిత, జస్టిస్ బి. శరత్, జస్టిస్‌ సీవీ భాస్కర్ రెడ్డి, జస్టిస్ సాంబశివరావు, జస్టిస్ చిన్నకూరి సుమలత, జస్టిస్ వేణుగోపాల్, జస్టిస్ పుల్ల కార్తీక్, జస్టిస్ ఎన్.సుధీర్ కుమార్, జస్టిస్ లక్ష్మణ్, ఎమ్మెల్యేలు అరికెపుడి గాంధీ, భాస్కర్‌రావు, పలువురు ప్రజాప్రతినిధులు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు ఘనస్వాగతం పలికారు. అక్కినేని నాగేశ్వరరావు 99వ జయంతి సందర్భంగా శుక్రవారం సాయంత్రం తెలుగు విశ్వవిద్యాలయంలో ‘రసమయి-డాక్టర్‌ అక్కినేని లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు’ను జస్టిస్‌ రమణ అందుకోనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని