Taraka Ratna: కర్ణాటక సీఎం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు: మంత్రి సుధాకర్‌

తారకరత్న ఆరోగ్యం విషయంలో కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని ఆ రాష్ట్ర మంత్రి సుధాకర్‌ తెలిపారు.

Published : 29 Jan 2023 14:13 IST

బెంగళూరు: తారకరత్న ఆరోగ్యం విషయంలో కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని ఆ రాష్ట్ర మంత్రి సుధాకర్‌ తెలిపారు. కుప్పం నుంచి గ్రీన్‌ కారిడార్‌ ఏర్పాటు చేసి నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తారకరత్నను తీసుకొచ్చామన్నారు. ఆస్పత్రి వద్ద ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌తో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. 

‘‘తారకరత్నకు నిన్నటి నుంచి నారాయణ హృదయాలయలో చికిత్స కొనసాగుతోంది. స్థానికంగా ఉన్న నిమ్హాన్స్‌ నుంచి బ్రెయిన్‌కు సంబంధించిన ప్రత్యేక వైద్యుల్ని రప్పించాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సహకారం అందిస్తున్నాం. తారకరత్న చికిత్సకు స్పందిస్తున్నారు. నిన్నటితో పోలిస్తే ఇవాళ పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది’’ అని సుధాకర్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని