Karate Kalyani: దత్తత విచారణ ముగిసింది.. నాకు క్లీన్ చిట్ ఇచ్చారు : కరాటే కల్యాణి
దత్తపుత్రిక విషయమై సీడబ్ల్యూసీతో సినీ నటి కరాటే కల్యాణి (Karate Kalyani) విచారణ ముగిసింది.
హైదరాబాద్: దత్తపుత్రిక విషయమై బాలల హక్కుల పరిరక్షణ కమిషన్తో సినీ నటి కరాటే కల్యాణి (Karate Kalyani) విచారణ ముగిసింది. సమగ్ర విచారణ అనంతరం సంబంధిత అధికారులు కల్యాణి దగ్గర ఉన్న చిన్నారిని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. వీరు రంగారెడ్డి జిల్లాకు చెందినవారు కావడంతో కేసును అక్కడి అధికారులకు బదిలీ చేశారు. చిన్నారులను దత్తత తీసుకునే విషయంలో అందరూ ప్రభుత్వ నిబంధనలు తప్పకుండా పాటించాలని అధికారులు సూచించారు. అనంతరం, కల్యాణి మీడియాతో మాట్లాడారు. దత్తత తీసుకోవాలనుకుంటే న్యాయపరంగానే తీసుకుంటానని తెలిపారు. పాపను దత్తత తీసుకోలేదన్నారు. ఆ పాప తల్లిదండ్రులే తనతోపాటు ఉంటున్నారన్నారు. విచారణ పూర్తయిన తర్వాత అధికారులు తనకు క్లీన్ చిట్ ఇచ్చినట్టు తెలిపారు. రెండు రోజుల నుంచి తనపై అనేక ఆరోపణలు వచ్చాయని, తన తల్లి, తమ్ముడు ఆత్మహత్య చేసుకుంటామన్నారని, వారికి ధైర్యం చెప్పానని పేర్కొన్నారు. తనపై ఆరోపణలు చేసిన వారిలో కొందరు రాజకీయనాయకులు, అధికారులు ఉన్నారన్నారు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేసిన వారిపై త్వరలోనే కోర్టుకు వెళ్లనున్నట్టు చెప్పారు.
కల్యాణి అక్రమంగా చిన్నారులను దత్తత తీసుకోవడం, కొనుగోలు చేయడం వంటి నేరాలకు పాల్పడుతున్నారంటూ చైల్డ్లైన్ టోల్ఫ్రీ నం.1098కు ఫిర్యాదు అందగా సంబంధిత అధికారులు, పోలీసులు ఆమె ఇంటిని ఇటీవల సోదా చేసిన సంగతి తెలిసిందే. తాను ఆ పాపను దత్తత తీసుకోలేదని, తనను కేసులో ఇరికించేందుకు కొందరు కుట్రపూరిత చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించిన కల్యాణి మంగళవారం విచారణ నిమిత్తం సీడబ్ల్యూసీ కార్యాలయానికి వెళ్లగా అధికారులు లేకపోవడంతో బుధవారం మరోసారి హాజరయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.