karnataka: గర్ల్ఫ్రెండ్ని ట్రాలీ బ్యాగ్లో పెట్టి.. హాస్టల్ వార్డెన్కి రెడ్హ్యాండెడ్గా చిక్కి
కర్ణాటకలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి తన ప్రేయసితో ఏకాంతంగా గడిపేందుకు ట్రాలీబ్యాగ్లో ఆమెను కుక్కెసీ హస్ట్లకు తీసుకువస్తుండగా వార్డెన్కు దొరికిపోయాడు.
ఇంటర్నెట్ డెస్క్: సినిమాల ప్రభావం జనాల మీద చాలా వరకే ఉంటుందన్నది అందరూ నమ్మే మాట. మొన్నటికి మొన్న ‘పుష్ప’లో అల్లు అర్జున్ మాదిరి స్మగ్లింగ్ చేస్తూ ఓ వ్యక్తి పోలీసులకు చిక్కాడు. ఇప్పుడూ మరో సినిమా సన్నివేశాన్ని పోలే సంఘటన కర్ణాటకలోని మనిపాల్ హాస్టల్లో చోటుచేసుకుంది. తన ప్రేయసితో కలిసి ఉండేందుకు ఏకంగా ఆమెను తన హాస్టల్ గదిలోకి తెచ్చేందుకు పన్నాగం పన్నాడు ఓ విద్యార్థి. అయితే అది విఫలమై అడ్డగా దొరికిపోయాడు. తనతో పాటు అదే కళాశాలలో చదువుతున్న తన ప్రేయసిని పెద్ద ట్రాలీ బ్యాగ్లో కుక్కేసి హాస్టల్ గదికి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశాడు. అయితే దీన్ని గమనించిన హాస్టల్ వార్డెన్ అనుమానంతో అందులో ఏమున్నాయని ఆ విద్యార్థినిని ప్రశ్నించాడు. ఆన్లైన్ ఆర్డర్లు వచ్చాయని, అవే ట్రాలీలో ఉన్నాయని నమ్మబలికాడు. అయితే ఆ విషయాన్ని నమ్మని వార్డెన్ ట్రాలీని బలవంతంగా తెరిపించాడు. దీంతో ట్రాలీ నుంచి అమ్మాయి బయటకి రావడంతో వార్డెన్ అవాక్కయ్యాడు. తనతో ఏకాంతంగా గడిపేందుకే రూమ్కి తీసుకెళ్తున్నట్లు చివరికి విద్యార్థి ఒప్పుకోవడంతో.. సదరు కళాశాల విచారించి ఇద్దరిని సస్పెండ్ చేసి ఇంటికి పంపించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
-
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
-
గులకరాయికి.. రాజకీయ రంగు!
-
నేటి నుంచి రేవంత్ ప్రచారభేరి