Farmers protest: రైతుల నిరసనలకు కాంగ్రెస్ నిధులిచ్చింది
కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపడుతున్న ఆందోళనల విషయంలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. దిల్లీ శివార్లలో, ఇతర ప్రాంతాల్లో చేపడుతున్న నిరసనలకు...
కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై వివాదాస్పద వ్యాఖ్యలు
బెంగళూరు: కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళనల విషయంలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ధరల పెంపు అంశంపై సోమవారం ఆయన అసెంబ్లీలో ప్రతిపక్షాలకు సమాధానం ఇస్తూ.. దిల్లీ శివార్లలో, పరిసర ప్రాంతాల్లో చేపట్టిన నిరసనలకు కాంగ్రెస్, దేశంలోని విదేశీ ఏజెంట్ల నుంచి నిధులు అందాయని ఆరోపించారు. ‘ఈ నిరసనలు దిల్లీ చుట్టే జరిగాయి. మరెక్కడా జరగలేదు. ఎందుకంటే మీరు అక్కడ వాటికి స్పాన్సర్ చేశార’ని అన్నారు. కమీషన్ ఏజెంట్లూ వీటి వెనుక ఉన్నారని.. దేశ ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని కాంగ్రెస్నుద్దేశంచి వ్యాఖ్యానించారు. దీంతో సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ.. కాంగ్రెస్ నేతలు ఎదురుదాడికి దిగారు. ఇలా మాట్లాడటం.. రైతులను అవమానించడమేనన్నారు. వెంటనే వారికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అత్యంత బాధ్యతారహితమైన వ్యాఖ్య అని ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విమర్శించారు. ఒకవేళ కేంద్రం వద్ద ఆధారాలు ఉంటే బాధ్యులను అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు. ద్రవ్యోల్బణం, వంట గ్యాస్, పెట్రో ధరల పెరుగుదల తదితర అంశాలపై ప్రశ్నించగా.. అడగని వాటికి సమాధానం ఇచ్చారన్నారు. పెరుగుతున్న ఇంధన ధరలకు నిరసనగా కేపీసీసీ ఆధ్వర్యంలో ఇటీవల ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తదితరులు విధాన సౌధ (అసెంబ్లీ) వరకు సైకిళ్లపై వచ్చారు. ఈ పరిణామాలతో భాజపా, కాంగ్రెస్ మధ్య వాతావరణం వేడెక్కింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?