విమానాశ్రయ సిబ్బందికి టీకాలు
విమానాశ్రయాల్లో పనిచేసే సిబ్బందికి ప్రాధాన్యతనిచ్చి వ్యాక్సిన్ను అందించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ శనివారం సర్య్కులర్ జారీ చేశారు.
వారూ ఫ్రంట్లైన్ వర్కర్లేనన్న కర్ణాటక ప్రభుత్వం
బెంగళూరు: విమానాశ్రయాల్లో పనిచేసే సిబ్బందికి ప్రాధాన్యతనిచ్చి వ్యాక్సిన్ను అందించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ శనివారం సర్య్కులర్ జారీ చేశారు. విమానాశ్రయాల్లో పనిచేసే సిబ్బందిని ఫ్రంట్లైన్ వర్కర్స్గా గుర్తించి మొదటి దశలోనే వారికి వ్యాక్సిన్ను అందించనున్నట్లు వారు తెలిపారు. ఈ నేపథ్యంలో కెంపెగౌడ, మంగళూరు, బెళగావి, హుబ్బళి-ధార్వాడ్, కలబురిగి, మైసూరు, బీదర్ విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించారు. విమానాశ్రయ సిబ్బందికి వ్యాక్సిన్ అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయా జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విమానాశ్రయాల్లో పనిచేసే ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా ఇప్పటి వరకూ కర్ణాటకలో 1,38,656 మంది వ్యాక్సిన్ తీసుకున్నారని కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 2శాతం మందికి మాత్రమే స్వల్ప ఇబ్బందులు తలెత్తాయని ఆయన వెల్లడించారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు