కేసీఆర్‌, జగన్‌ రంజాన్‌ శుభాకాంక్షలు

పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్షలతో రంజాన్

Published : 13 May 2021 17:15 IST

హైదరాబాద్‌: పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్షలతో రంజాన్ మాసం శాంతి, ప్రేమ, దయ, సౌభ్రాతృత్వ గుణాలను పంచుతుందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణలో గంగాజమునా తహజీబ్‌కు రంజాన్ పర్వదినం ప్రతీక అని చెప్పారు. మైనారిటీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు ముస్లింల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని... గుణాత్మక ఫలితాలు ఇస్తున్నాయని కేసీఆర్ అన్నారు.

అల్లా దీవెనలతో ప్రపంచ మానవాళికి శుభాలు కలగాలని ఏపీ సీఎం జగన్‌ ఆకాంక్షించారు. ప్రజలు కరోనా నుంచి బయటపడి ఆయురారోగ్యాలతో జీవించాలన్నారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్‌ అని చెప్పారు. అల్లా రక్షణ, కరుణ పొందాలనే రంజాన్‌ మాసంలో ప్రత్యేక ప్రార్థనలు జరుపుకొంటారన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని