Kids Homework: మీ పిల్లలు సరిగా హోం వర్క్ చేస్తున్నారా!
పిల్లలు ఎప్పుడూ స్వేచ్ఛగా ఉండాలనుకుంటారు. చదవటం, రాయడం వంటివి చేసేందుకు ఇష్టపడరు. కానీ హోం వర్క్ చేయడం తప్పనిసరి కదా. మరి వాళ్లతో ఎలా చేయించాలి..?
ఇంటర్నెట్ డెస్క్: మీ పిల్లలు హోం వర్క్ అంటే సాకులు వెతుకుతున్నారా! ఈ అనుభవం చాలామంది పేరెంట్స్కి ఎదురయ్యే ఉంటుంది. పిల్లలు ఎప్పుడూ స్వేచ్ఛగా ఉండాలనుకుంటారు. చదవటం, రాయడం వంటివి చేసేందుకు ఇష్టపడరు. కానీ హోం వర్క్ చేయడం తప్పనిసరి కదా. మరి వాళ్లతో ఎలా చదివించాలి?
* పిల్లలను తిట్టి, కొట్టి హోం వర్క్ చేయించాలనే ఆలోచన మానుకోండి. దీనివల్ల వాళ్లు మొండిగా తయారవుతారు. చాలామంది పిల్లలు హోం వర్క్ పేరు తీయగానే.. ఆడుకున్న తరవాత చేస్తాం, తిన్నాక చేస్తాం, ఉదయం నిద్ర లేచిన తరవాత చేస్తాం.. అంటూ రకరకాల సాకులు చెబుతుంటారు. వెంటనే వాళ్ల మీద అరవటం వంటివి చేయకండి.
* స్కూల్ నుంచి రాగానే వాళ్లకు స్నాక్స్ పెట్టండి. స్కూల్లో జరిగిన విషయాల గురించి వాళ్లతో చర్చించండి. చేయించాల్సిన హోం వర్క్ ఏముందో చూడండి. తక్కువగా ఉన్న పనిని ముందుగా పూర్తి చేయాలని చెప్పండి. కాస్త సమయం ఎక్కువ తీసుకునే పనులను మెల్లగా చేయించండి. హోం వర్క్ అంతా పూర్తి చేసిన తరవాత పిల్లలు ఆడుకోవటానికి సమయం ఉండదు అనే ఆలోచనలో ఉంటుంటారు. వాళ్లని ఇంట్లోనే ఉండాలనే షరతులు విధించకండి. ఆటలు ఆడుకునేందుకు బయటకు పంపించండి. దీంతో వాళ్ల శరీరానికి అవసరమయ్యే వ్యాయామం ఆటల ద్వారా చేసేస్తారు.
* పిల్లలు బట్టి పట్టి చదవకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ముఖ్యంగా తల్లి ఎక్కువ సమయం పిల్లలతో ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల హోం వర్క్లో సైన్స్ ప్రాజెక్టులు చేయాల్సి వస్తే.. కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టి పిల్లలకు నేర్చించాలి. పిల్లలకు యాంత్రికంగా కాకుండా ఆ సబ్జెక్టు గురించి పూర్తి అవగాహన వచ్చే విధంగా వివరించి చెప్పండి.
* పిల్లల్లో ప్రత్యేక ప్రతిభ దాగి ఉంటుంది. దానిని వెలికి తీయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన ఉంది. పిల్లలు ఏఏ విషయాల్లో చురుగ్గా ఉంటున్నారు. ఏఏ సబ్జెక్టుల్లో వెనుకపడ్డారో గమనించాలి.
* కొంతమంది పేరెంట్స్ పిల్లల హోం వర్క్ గురించి ఆలోచించరు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. పిల్లలకు స్కూల్లో ఎలాంటి హోం వర్క్ ఇస్తున్నారు? పిల్లలు సకాలంలో పూర్తి చేస్తున్నారా? లేదా అనే విషయాలను తల్లిదండ్రులు పట్టించుకోవాలి.
*పిల్లలతో కలిసి యాక్టివిటీస్ చేయండి. స్కూల్లో యాక్టివిటీలు ఇస్తుంటారు. వీటిని పిల్లలకు ఎలా చేయాలో తల్లిదండ్రులు దగ్గరుండి చేయించాలి. వీటికి సంబంధించిన వస్తువులను వారికి కొనివ్వండి.
* పిల్లలు హోం వర్క్ చేయకుంటే స్కూల్లో టీచర్లు తమ పిల్లల్ని కొడతారని కొంతమంది వాళ్ల తల్లులే చేసేస్తుంటారు. ఇలా ఎంతమాత్రం చేయకూడదు. దీంతో పిల్లలు హోం వర్క్ చేసేందుకు ఆసక్తి చూపించరు. వాళ్లు మా అమ్మ చేసేస్తుందిలే అనే భావనలోకి వస్తారు.
పిల్లల మీద కోపం చూపిస్తే వాళ్లు మొండికేస్తారు. అందువల్ల ప్రేమతోనే వాళ్లకు దగ్గరవ్వండి. కఠినంగా ఉండకండి. ఇంట్లో స్నేహపూర్వక వాతావరణం ఉండేటట్లు చూడండి. వాళ్లతో మనసు విప్పి మాట్లాడండి. దీంతో వాళ్లకు కలిగే ప్రతి ఆలోచనను మీతో పంచుకునేందుకు అవకాశం ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
నగర శివారులో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి శ్రీశైలం జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. -
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. -
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
వైకాపా ప్రచారరథం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారారు. -
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేశాం: రంగరాజన్
హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేసినట్టు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు