Telangana News: ‘హునర్ హాట్’లో దేశ ఐక్యత కనిపిస్తోంది: కిషన్రెడ్డి
వారసత్వ కళల రక్షణ, ప్రోత్సాహం కోసం హూనర్ హాట్ కార్యక్రమం చేపడుతున్నామని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు.
హైదరాబాద్: వారసత్వ కళల రక్షణ, ప్రోత్సాహం కోసం హూనర్ హాట్ కార్యక్రమం చేపడుతున్నామని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ మైదానంలో ఏర్పాటు చేసిన హస్తకళా ప్రదర్శన(హునర్ హాట్)ను మరో కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీతో కలిసి కిషన్రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే రఘనందన్రావు పాల్గొన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేశామని కిషన్రెడ్డి వివరించారు. కార్యక్రమం మార్చి 6వ తేదీ వరకు కొనసాగుతుందని చెప్పారు. 30 రాష్ట్రాల నుంచి 700మంది కళాకారులు హాజరయ్యారని తెలిపారు.
‘‘హునర్ హాట్లో భారతదేశ ఐక్యత కనిపిస్తోంది. కొందరు లఖ్నవూ నుంచి.. మరికొందరు భోపాల్ నుంచి వచ్చారు. ఈశాన్య ప్రాంతాలకు చెందిన ఎంతోమంది కళాకారులు ఉన్నారు. కరోనా కారణంగా చిన్నచిన్న పనులు చేసుకునే వారు, శిల్పకారులు, కళాకారులు ఎందరో ప్రభావితం అయ్యారు. రెండేళ్లుగా వారు తయారు చేసిన ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ లేదు. ఇందుకే మైనార్టీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా 75చోట్ల హూనర్ హాట్ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు’’ అని కిషన్రెడ్డి అన్నారు.
ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మాట్లాడుతూ.. ‘‘హునర్ హాట్ కార్యక్రమం వెనుక ఓ ఆలోచన, సంకల్పం ఉన్నాయి. శిల్పకారులు, చేతివృత్తిదారుల, కళాకారుల వారసత్వ కళలకు మార్కెటింగ్ కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం. మరోవైపు స్వదేశీ కళల స్వావలంబన సాధించేందుకు ఇది ఒక ప్రభావవంతమైన కార్యక్రమం. శిల్పకారులు, చేతివృత్తిదారుల, కళాకారుల సంరక్షణ ప్రోత్సాహానికి హునర్ హాట్ భాగస్వామ్యం అవుతుంది’’ అని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అందుకు పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు