Vijayawada: హైదరాబాద్కు రైళ్లలో వచ్చే ఏపీ ప్రజల కోసం న్యూ రైల్వే టెర్మినల్: కిషన్రెడ్డి
హైదరాబాద్కు రైళ్లలో వచ్చే ఏపీ ప్రజల సౌకర్యం కోసం నగరశివారులోని చర్లపల్లి వద్ద న్యూ రైల్వే టెర్మినల్ కడతామని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రకటించారు.
విజయవాడ: ఏపీలో రైల్వే ప్రాజెక్టుల కోసం గత బడ్జెట్లో కంటే ఈసారి 20శాతం అధికంగా నిధులు కేటాయించారని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. 2004 నుంచి 2014 వరకు యూపీఏ హయాంలో ఆంధ్రప్రదేశ్లో 58 కి.మీ మాత్రమే కొత్త లైన్లు వేస్తే.. మోదీ ప్రభుత్వ హయాంలో 350 కి.మీ కొత్త లైన్లు వేశామని చెప్పారు. రాష్ట్రంలో రైల్వే విభాగానికి బడ్జెట్లో రూ.8,600 కోట్లు కేటాయించారని తెలిపారు. మచిలీపట్నం వరకు పొడిగించిన ధర్మవరం-విజయవాడ ఎక్స్ప్రెస్ రైలును విజయవాడలో రైల్వేస్టేషన్లో జెండాఊపి ఆయన ప్రారంభించారు. మరి కొన్ని రైళ్లను పొడిగిస్తున్నట్టు చెప్పారు. విజయవాడ విమానాశ్రయం మాదిరిగా రైల్వే స్టేషన్ను కూడా అభివృద్ధి చేస్తామన్నారు. డీపీఆర్ సిద్ధమయ్యాక పనులు చేపడతామని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో కొత్త లైన్లు, ఎలక్ట్రిఫికేషన్, ట్రిప్లింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.
హైదరాబాద్కు రైళ్లలో వచ్చే ఏపీ ప్రజల సౌకర్యం కోసం నగరశివారులోని చర్లపల్లి వద్ద న్యూ రైల్వే టెర్మినల్ కడతామని కిషన్రెడ్డి ప్రకటించారు. విజయవాడ-హుబ్బళీ ఎక్స్ప్రెస్ నర్సాపురం వరకు, విజయవాడ-షిర్డీ ఎక్స్ప్రెస్ మచిలీపట్నం వరకు, విశాఖ-కాచిగూడ రైలును మహబూబ్నగర్ వరకు, విశాఖ-విజయవాడ ఎక్స్ప్రెస్ను గుంటూరు వరకు, నంద్యాల-కడప ఎక్స్ప్రెస్ను రేణిగుంట వరకు పొడిగిస్తామని తెలిపారు. సికింద్రాబాద్-తిరుపతి మధ్య త్వరలో వందేభారత్ రైలు వచ్చే అవకాశముందని కిషన్రెడ్డి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు
తాజా వార్తలు (Latest News)
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్