Kishan Reddy:  కలాం.. దేశభవిష్యత్తు గురించి నిత్యం ఆలోచించిన మహనీయుడు

దేశ భవిష్యత్తు గురించి నిత్యం ఆలోచించిన మహనీయుడు అబ్దుల్‌ కలాం అని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ నాంపల్లిలోని పొట్టిశ్రీరాములు తెలుగు

Updated : 09 Oct 2021 18:55 IST

హైదరాబాద్: దేశ భవిష్యత్తు గురించి నిత్యం ఆలోచించిన మహనీయుడు అబ్దుల్‌ కలాం అని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ నాంపల్లిలోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో కలాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యూత్‌ ఎక్సలెన్స్‌ ఆధ్వర్యంలో కలాం జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జస్టిస్‌ చంద్రయ్య,  కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. అబ్దుల్‌ కలాం దేశాభివృద్ధిలో యువతను చైతన్యపరిచి ముందుకు తీసుకెళ్లారని కొనియాడారు. తుది శ్వాసవరకు ఆయన దేశం కోసం, సమాజం కోసం, దేశ భవిష్యత్తు కోసమే కలలు గన్నారని, వాటిని సాకారం చేసేందుకు అనేక ప్రయత్నాలు చేశారని తెలిపారు. చీకట్లో చిరుదీపం వెలిగించే ప్రయత్నం అందరం చేయాలని, దేశాన్ని మరింత శక్తిమంతంగా తీర్చిదిద్దేందుకు ప్రతిఒక్కరి భాగస్వామ్యం కోరుకున్న మహనీయుడు కలాం అని కిషన్‌రెడ్డి కొనియాడారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని