మంచుబిందువులు తెచ్చిన ఫోటోగ్రఫీ అవార్డు..
కొల్హాపూర్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆపిల్ సంస్థ నుంచి ఫోటోగ్రఫీ అవార్డును గెలుచుకున్నారు. వివరాల్లోకి వెళితే... ప్రముఖ దిగ్గజ సంస్థ ఆపిల్ తన ప్రత్యేకతలను ప్రపంచానికి చాటిచెప్పడానికి రకరకాల పోటీలు నిర్వహిస్తూ ఉంటుంది.
కొల్హాపూర్: మహారాష్ట్రలోని కొల్హాపూర్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆపిల్ సంస్థ నుంచి ఫోటోగ్రఫీ అవార్డును గెలుచుకున్నారు. వివరాల్లోకి వెళితే... ప్రముఖ దిగ్గజ సంస్థ ఆపిల్ తన ప్రత్యేకతలను ప్రపంచానికి చాటిచెప్పడానికి రకరకాల పోటీలు నిర్వహిస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఇటీవల 'షాట్ ఆన్ ఐఫోన్' పేరుతో ఫొటోగ్రఫీ పోటీని నిర్వహించింది. ఈ ఏడాది జనవరి 25 నుంచి ఫిబ్రవరి 16 వరకు పోటీలు జరిగాయి. ఇందులో కస్టమర్లు వారి ఐ ఫోన్13 ప్రో, ఐ ఫోన్13 ప్రో మ్యాక్స్లతో చిత్రాలను తీయాల్సి ఉంటుంది. చైనా, ఇటలీ, స్పెయిన్, థాయ్లాండ్, అమెరికాకు చెందిన వారు ఈ పోటీల్లో పాల్గొన్నారు. వీరు పంపిన వాటిల్లో 10 ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి విజేతలుగా ప్రకటించారు.
విజేతలలో కొల్హాపూర్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రజ్వల్ చౌగులే ఉన్నారు. ‘నాకు ప్రతి రోజు ఉదయం నడకకు వెళ్లడం అలవాటు. అలా నడుస్తున్నప్పుడు ప్రకృతిలో కనిపించే అద్భుతాలను ఫొటోలు తీస్తుంటాను. అలా తీసిందే ఈ చిత్రం. సాలెపురుగు గూడుకి మంచు బిందువులు హారంలా అల్లుకున్నాయి. అది నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అందుకే ఆ ఫొటోని ఆపిల్ నిర్వహించిన 'షాట్ ఆన్ ఐఫోన్' ఛాలెంజ్కు పంపాను. ఉత్తమ 10 చిత్రాల్లో అది ఎంపికవ్వడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది’ అంటూ ప్రజ్వల్ తన ఆనందాన్ని పంచుకున్నారు. విజేతల ఫొటోలను, వారి దేశాలను ఆపిల్ తన అధికారిక వైబ్సైట్లలో పొందుపరుస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు మార్గంలో భారీగా ట్రాఫిక్జామ్: వాహనాలు నిలిపి.. కి.మీ మేర నడిచి..
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్టే: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ