Andhra News: ఇంకా 3 రాజధానులని మాట్లాడటం కోర్టుని అగౌరవపరచడమే: కొలికపూడి
రాజధాని అమరావతిపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి కన్వీనర్ కొలికపూడి శ్రీనివాస్ తిరుమల
అమరావతి: రాజధాని అమరావతిపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి కన్వీనర్ కొలికపూడి శ్రీనివాస్ తిరుమల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. తుళ్లూరు శివాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి కృతజ్ఞత యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజధాని ఐకాస కన్వీనర్ పువ్వాడ సుధాకర్ జెండా ఊపగా, మహిళా రైతులు హారతులిచ్చారు. తుళ్లూరు నుంచి తిరుమల వరకు గతంలో రాజధాని రైతులు చేపట్టిన పాదయాత్ర మార్గంలోనే శ్రీనివాస్ యాత్ర సాగనుంది.
ఈ సందర్భంగా కొలికపూడి శ్రీనివాస్ మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం గౌరవించాలన్నారు. ప్రభుత్వం ఇంకా మూడు రాజధానులని మాట్లాడటం కోర్టుని అగౌరవపరచడమే అని వ్యాఖ్యానించారు. రాజధాని నిర్మాణానికి బడ్జెట్లో నిధులు కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని పూర్తయితే పెట్టుబడులు వచ్చి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు. పువ్వాడ సుధాకర్ మాట్లాడుతూ కొలికపూడి శ్రీనివాస్ చేపట్టిన పాదయాత్రకు ఐకాస తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్