Komati jayaram: కందుకూరు ఘటన బాధితులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం: కోమటి జయరామ్
బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు తెదేపా ఎన్నారై విభాగం ముందుకొచ్చింది. మృతి చెందిన వారిలో ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని కోమటి జయరామ్ ప్రకటించారు.
అమరావతి: నెల్లూరు జిల్లా కందుకూరులో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు రోడ్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మరణించిన కుటుంబాలకు అండగా నిలిచేందుకు తెదేపా ఎన్నారై విభాగం ముందుకొచ్చింది. ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెదేపా ఎన్నారై సెల్ నాయకులు కోమటి జయరాం తెలిపారు.
నిన్న జరిగిన ఘటనలో 8మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఒక్కో కుటుంబానికి తెలుగుదేశం తరఫున పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రూ.15లక్షల ఆర్థిక సాయం అందించారు. తెదేపా ఎన్నారై విభాగం, తన తరఫున ఒక్కో కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించనున్నట్టు కోమటి జయరామ్ ప్రకటించారు. బాధిత కుటుంబాలకు చెందిన పిల్లలు విదేశాల్లో చదువుకోవాలనుకుంటే అన్ని విధాలుగా సాయపడేందుకు తెదేపా ఎన్నారై విభాగం సిద్ధంగా ఉందని తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Harish Shankar: అందుకే ‘ఉస్తాద్ భగత్సింగ్’ అప్డేట్లు ఇవ్వను: హరీశ్శంకర్ కామెంట్స్ వైరల్
-
General News
Sajjanar: అలాంటి సంస్థలకు ప్రచారం చేయొద్దు: సెలబ్రిటీలకు సజ్జనార్ సలహా
-
General News
CM Jagan: రెండ్రోజుల పాటు సీఎం జగన్ దిల్లీ పర్యటన
-
Sports News
Hockey World Cup 2023: హాకీ ప్రపంచకప్ విజేత జర్మనీ
-
India News
Bharat Jodo Yatra: 5 నెలలు.. 4000 కి.మీ.. ముగిసిన రాహుల్ యాత్ర..!
-
Movies News
Sidharth Malhotra: సిద్ధార్థ్ ‘బోల్డ్ అనౌన్స్మెంట్’.. ఆయన చెప్పబోయేది దాని గురించేనా?