Ukraine Crisis: ఉక్రెయిన్ నుంచి సురక్షితంగా తీసుకొస్తాం.. ఆందోళన వద్దు: కృష్ణబాబు
ఉక్రెయిన్ నుంచి ఏపీ విద్యార్థులను సురక్షితంగా రాష్ట్రానికి తరలిస్తున్నామని ఏపీ టాస్క్ఫోర్స్ కమిటీ అధ్యక్షుడు కృష్ణబాబు తెలిపారు. శనివారం ఆయన సచివాలయంలో
అమరావతి: ఉక్రెయిన్ నుంచి ఏపీ విద్యార్థులను సురక్షితంగా రాష్ట్రానికి తరలిస్తున్నామని ఏపీ టాస్క్ఫోర్స్ కమిటీ అధ్యక్షుడు కృష్ణబాబు తెలిపారు. శనివారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఉక్రెయిన్ నుంచి విద్యార్థులను తీసుకొచ్చేందుకు జరుగుతున్న ఏర్పాట్లను వివరించారు.
‘‘ఈరోజు సాయంత్రం ఒక విమానం ముంబయి, మరొకటి రేపు తెల్లవారుజామున దిల్లీ చేరుకుంటాయి. ముంబయి వచ్చే ఫ్లైట్లో 9 మంది, దిల్లీ వచ్చే ఫ్లైట్లో 13 మంది విద్యార్థుల జాబితాను కేంద్రం ఇచ్చింది. వీరిలో ఏపీకి చెందిన వారు ఎంతమంది ఉంటారనేది కచ్చితంగా చెప్పలేం. ముంబయి, దిల్లీలో రిసెప్షన్లు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. కస్టమ్స్ ఆఫీసర్ రామకృష్ణ ముంబయి ఎయిర్పోర్టుకు వచ్చే విద్యార్థులను రిసీవ్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేయమని ఆదేశించాం. దిల్లీలో ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్, అడిషనల్ రెసిడెంట్ కమిషనర్ హిమాన్ష్ దిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకునే విద్యార్థులను రిసీవ్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. ఎంతమంది వస్తున్నారో తెలియదు, వారి చిరునామాపై కూడా క్లారిటీ లేదు. ఏపీ ప్రభుత్వం పేరుతో ప్లకార్డు పట్టుకుని అధికారులు ఎయిర్పోర్టులో సిద్ధంగా ఉంటారు. జబితాలో పేరు లేకపోయినా.. ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థులు ఎవరు వచ్చినా రిసీవ్ చేసుకుని వారికి దిల్లీలోని ఏపీ భవన్లో, ముంబయిలో వసతి కల్పించి, ఆ తర్వాత వారి స్వస్థలాలకు చేరుకునేందుకు ఏర్పాట్లు చేస్తారు. పూర్తిగా ప్రభుత్వం ఖర్చులతోనే వారిని రాష్ట్రానికి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. అందుకు అనుగుణంగా దిల్లీ, ముంబయిలో ఏర్పాట్లు చేశాం’’ అని కృష్ణబాబు తెలిపారు.
విద్యార్థులు ఎలాంటి సాహసాలు చేయెద్దు..
‘‘విద్యార్థులు సరిహద్దు ప్రాంతాలకు చేరుకుంటే అక్కడి నుంచి రిసీవ్ చేసుకుని పంపించే ఏర్పాట్లు చేస్తామని నిన్న ఉదయం విదేశాంగ శాఖ అధికారులు చెప్పారు. మళ్లీ నిన్న సాయంత్రం... విద్యార్థులు సరిహద్దు ప్రాంతాలకు రావొద్దు, ఎక్కడి వారు అక్కడే ఉండాలని సమాచారమిచ్చారు. రష్యా సైన్యం పౌరులను లక్ష్యంగా చేసుకోవడం లేదు కాబట్టీ ఎక్కడి వారు అక్కడే సేఫ్గా ఉండాలని సూచించారు. బాంబింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో ఉన్న వారు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బంకర్స్లోగానీ, ఇళ్లలోగాని ఉండటం మంచిదని సలహా ఇచ్చారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశాం. దాదాపు 300 మంది విద్యార్థులు ఈ గ్రూప్లో ఉన్నారు. వీరందరికీ భారత విదేశాంగ శాఖ అందించే సూచనలు, సలహాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాం. విదేశాంగ శాఖ సూచనలు పట్టించుకోకుండా... ఎలాగొలా సరిహద్దు ప్రాంతానికి చేరుకుంటే భారత్కు తీసుకెళ్తారనే ఉద్దేశంతో విద్యార్థులు ఎలాంటి సాహసాలు చేయెద్దు. ఉక్రెయిన్లో పరిస్థితులను గమనించే విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తుంది. వాటిని కచ్చితంగా పాటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుంది. విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ముఖ్యంగా 7 యూనివర్సిటీల పరిధిలో ఉన్నట్టు సమాచారం ఉంది. ఈ యూనివర్సిటీలన్నీ రొమేనియాకు దగ్గర్లోనే ఉన్నాయి. భారత ఎంబసీ వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకున్న విద్యార్థులకు నేరుగా ఎంబసీ నుంచే సమాచారం వెళుతుంది. విద్యార్థులు ఎక్కడికి రావాలి, ఎలా చేరుకోవాలనేదానిపై సూచనలు చేస్తారు. ఏపీ విద్యార్థులకు ఎలాంటి భయాందోళనలు వద్దు’’ అని కృష్ణబాబు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్