తెలుగు రాష్ట్రాలకు బస్సులు.. కర్ణాటక రైట్ రైట్!
లాక్డౌన్తో నిలిపివేసిన అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులను కర్ణాటక ప్రభుత్వం మళ్లీ ప్రారంభించనుంది. కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతితో అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులను రద్దు చేసిన కేఎస్ఆర్టీసీ.. రాష్ట్రంలో లాక్డౌన్ ఆంక్షలు ....
రేపట్నుంచే బస్సు సర్వీసులు పునరుద్ధరణ
బెంగళూరు: లాక్డౌన్తో నిలిపివేసిన అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులను కర్ణాటక ప్రభుత్వం మళ్లీ ప్రారంభించనుంది. కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతితో అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులను రద్దు చేసిన కేఎస్ఆర్టీసీ.. రాష్ట్రంలో లాక్డౌన్ ఆంక్షలు సడలించడంతో ఏపీ, తెలంగాణకు రేపట్నుంచి ఆర్టీసీ బస్సులు నడపాలని నిర్ణయించింది. ఈ నెల 22 నుంచి 50శాతం సీటింగ్ సామర్థ్యంతో బస్సులు నడపనున్నట్టు కేఎస్ఆర్టీసీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ (ఆపరేషన్స్) ఓ ప్రకటనలో వెల్లడించారు. రేపు ఉదయం 6గంటల నుంచి ఆంధ్రప్రదేశ్కు సర్వీసులు ప్రారంభమవుతాయని, అలాగే, ఏపీలో ఆంక్షలు కొనసాగుతుండటంతో సాయంత్రం 6గంటల కల్లా చేరుకొనేలా సర్వీసులు ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
బస్సుల్లో ప్రయాణించేవారంతా తప్పకుండా మాస్క్లు ధరించాలన్నారు. కరోనా నిబంధనలు ప్రతిఒక్కరూ పాటించాలని సూచించారు. ప్రయాణాలకు సంబంధించి ముందస్తుగానే ఆన్లైన్ టిక్కెట్లను ksrtc.karnataka.gov.in లేదా www.ksrtc.in వెబ్సైట్లలో బుక్ చేసుకోవచ్చని తెలిపారు. మరింత సమాచారం కోసం కేఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్ 080-26252625ను సంప్రదించవచ్చన్నారు.
కరోనా వైరస్ ఉద్ధృతి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కొన్ని జిల్లాల్లో సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. అధిక పాజిటివిటీ రేటు ఉన్న 13 జిల్లాల్లో మాత్రం ఈ నెల 21 నుంచి జులై 5వరకు లాక్డౌన్ కొనసాగుతుందని సీఎం యడియూరప్ప శనివారమే స్పష్టంచేసిన విషయం తెలిసిందే. 5శాతం కన్నా తక్కువ పాజిటివిటీ రేటు ఉన్న 19 జిల్లాల్లో సాయంత్రం 5గంటల వరకు అన్ని దుకాణాలూ సాయంత్రం 5గంటల వరకు తెరుచుకొనేందుకు అనుమతించారు. బస్సులు, మెట్రో రైల్ సర్వీసులు 50శాతం సామర్థ్యంతో సేవలు అందించేందుకు అవకాశం కల్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ), కెమిస్ట్ ఉద్యోగాల నియామక రాత పరీక్ష వాయిదా పడింది. -
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్