KTR: ప్రతిభ లేకుండా రాజకీయాల్లో ఎవరూ రాణించలేరు: కేటీఆర్‌

ఏ ప్రతిభ లేకున్నా రాజకీయాలు చేయొచ్చని కొందరు భావిస్తున్నారని.. అయితే, ప్రతిభ లేకుండా రాజకీయాల్లో ఎవరూ రాణించలేరని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.

Updated : 12 Nov 2022 18:00 IST

హైదరాబాద్‌: ఏ ప్రతిభ లేకున్నా రాజకీయాలు చేయొచ్చని కొందరు భావిస్తున్నారని.. అయితే, ప్రతిభ లేకుండా రాజకీయాల్లో ఎవరూ రాణించలేరని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. అంబేడ్కర్‌ వర్సిటీలో నిర్వహించిన ‘మీడియా ఇన్‌ తెలంగాణ-పాస్ట్‌, ప్రసెంట్‌, ఫ్యూచర్‌’ అనే అంశంపై నిర్వహించిన చర్చాగోష్టిలో కేటీఆర్‌ పాల్గొని మాట్లాడారు. ‘‘స్వాతంత్ర్య, తెలంగాణ ఉద్యమాల్లో పత్రికలు కీలక పాత్ర పోషించాయి. తెలంగాణ ఉద్యమంలో మీడియా యాజమాన్యాలు మాకు వ్యతిరేకంగా ఉండేవి. ఉద్యమం ప్రారంభించినప్పుడు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం. తొలినాళ్లలో కేసీఆర్‌ చిత్తశుద్ధిని కూడా శంకించారు. కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో తెదేపాను ఎదుర్కొని ఉద్యమం నడిపించాం.సరిగ్గా మాట్లాడలేని నేతలను కూడా పత్రికలు అద్భుతంగా చిత్రీకరించాయి’’ అని కేటీఆర్‌ అన్నారు.

రాజకీయ వారసత్వంపై స్పందిస్తూ.. ‘‘రాజకీయాల్లో ప్రవేశానికి మాత్రమే వారసత్వం ఉపయోగపడుతుంది. సొంతంగా నిరూపించుకోలేకపోతే ఏ వారసత్వాన్ని కూడా ప్రజలు భరించరు. ఇందిరాగాంధీ వంటి మహానేతలనే ప్రజలు ఓడించారు. నా పనితీరు వల్లే సిరిసిల్లలో మెజారిటీ పెరిగింది. నేను పనిచేయకపోతే సిరిసిల్ల ప్రజలు ఎప్పుడో నన్ను పక్కన పెట్టేవారు’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని