KTR: ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కింద వాహనాలు పంపిణీ చేసిన మంత్రి కేటీఆర్
తన పుట్టినరోజు సందర్భంగా ‘గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం’ కింద వికలాంగులకు ప్రకటించిన వాహనాలను మంత్రి కేటీఆర్ పంపిణీ చేశారు...
హైదరాబాద్: తన పుట్టినరోజు సందర్భంగా ‘గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం’ కింద వికలాంగులకు ప్రకటించిన వాహనాలను మంత్రి కేటీఆర్ పంపిణీ చేశారు. హైదరాబాద్ జలవిహార్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీటిని అందజేశారు. తన పుట్టిన రోజుకు ఫ్లెక్సీలు, బ్యానర్ల కోసం డబ్బు వృథా చేయొద్దని కోరిన కేటీఆర్.. గత ఏడాది నుంచి గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమాన్ని చేపట్టారు. గతేడాది సిరిసిల్లలో ఆరు అంబులెన్స్లను దానం చేసిన ఆయన.. ఈ ఏడాది 130 స్కూటర్లను వికలాంగులకు అందించారు. కేటీఆర్ పిలుపు మేరకు ఎర్రబెల్లి దయాకర్రావు 150, ఎమ్మెల్యే కృష్ణారావు 100, ఎమ్మెల్సీలు నవీన్ 100, శంబీపూర్ రాజు 63, ఎమ్మెల్యే వివేకానంద్ 50 చొప్పున స్కూటర్లు అందించేందుకు ముందుకొచ్చారని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రకటించారు. రాజకీయాల్లో భాగంగా ప్రత్యేక రోజుల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లకు పెట్టే ఖర్చును ఇలాంటి మంచి కార్యక్రమాలకు వినియోగించాలని ఆయన కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ