Jagan-KTR: ఏపీ సీఎం జగన్‌ను కలిసిన తెలంగాణ మంత్రి కేటీఆర్‌

ఏపీ సీఎం జగన్‌ను తెలంగాణ మంత్రి కేటీఆర్‌ కలిశారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు ఇరు రాష్ట్రాల నుంచి తమ

Updated : 24 May 2022 15:25 IST

హైదరాబాద్‌: ఏపీ సీఎం జగన్‌ను తెలంగాణ మంత్రి కేటీఆర్‌ కలిశారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు ఇరు రాష్ట్రాల నుంచి తమ ప్రతినిధులతో వెళ్లిన జగన్‌, కేటీఆర్‌.. వివిధ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. 

పర్యటనలో భాగంగా మంగళవారం జగన్‌తో కేటీఆర్‌ సమావేశమయ్యారు. ఈ మేరకు కేటీఆర్‌ ట్వీట్‌ చేస్తూ జగన్‌తో కలిసి ఉన్న ఫొటోలను షేర్‌ చేశారు. 'నా సోదరుడు, ఏపీ సీఎం జగన్‌తో సమావేశం గొప్పగా జరిగింది’ అని కేటీఆర్‌ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని