KTR: వ్యాపారం మీది... సహకారం మాది: దళితబంధు పంపిణీలో కేటీఆర్
‘‘మాకు ఇవాళ కడుపు నిండినట్లు ఉంది. 50 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వం ఇలాంటి అర్థవంతమైన ఆలోచనతో ముందుకు రాలేదు’’ అని సిరిసిల్లకు చెందిన దళితబంధు లబ్ధిదారు చెప్పిన విషయాలపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
సిరిసిల్ల: ‘‘మాకు ఇవాళ కడుపు నిండినట్లు ఉంది. 50 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వం ఇలాంటి అర్థవంతమైన ఆలోచనతో ముందుకు రాలేదు’’ అని సిరిసిల్లకు చెందిన దళితబంధు లబ్ధిదారు చెప్పిన విషయాలపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సిరిసిల్లలో దళితబంధు పంపిణీ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. దళితబంధు లబ్ధిదారులు రాష్ట్రంలో ఎక్కడైనా వ్యాపారాలు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. అయితే, రూపాయి పెట్టుబడి పెడితే.. రూపాయిన్నర ఆదాయం వచ్చేలా ఆలోచన చేయాలని ఈ సందర్భంగా లబ్ధిదారులకు సూచించారు. ఈ పథకం విజయవంతమైతే.. దళితులకు వ్యాపారం చేసే తెలివి ఉంటుందా? అని అనుకునే ప్రతి ఒక్కరికీ తిరుగులేని సమాధానం చెప్పినట్టవుతుందన్నారు.
‘‘10 మంది లబ్ధిదారులు ఒక్కటై రూ.కోటితో (ఒక్కొక్కరు రూ.10లక్షలు చొప్పున) వ్యాపారం మొదలు పెట్టాలని అనుకుంటే అన్ని రకాలుగా సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రభుత్వ పరిధిలో టీఎఫ్ఎస్సీ (తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్) పని చేస్తుంది. ఈ 10 మంది కోటి రూపాయలు తీసుకొని టీఎఫ్ఎస్సీకి వస్తే మరో రూ.3 కోట్లు రుణం ఇప్పించే బాధ్యత నాది. ఇంత పెద్ద మొత్తంతో వ్యాపారం చేసి.. ఒక రూపాయి నుంచి మరో రూపాయి ఎలా పుట్టించాలనే ఆలోచన చేయాలి. ఉమ్మడి వ్యాపారం చేస్తే మరింత వృద్ధి సాధించవచ్చు. ఇలా ఒకరు చేసే ఆలోచన మరికొంత మందిలో ఆలోచనను పుట్టిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కొంత మందిలో ఒక అపోహ ఉంది. దళితబంధు పేరుతో సీఎం కేసీఆర్ కేవలం దళిత సమాజానికే ఎందుకు పెద్దపీట వేస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థికంగా అట్టడుగున ఉన్న దళితుల నుంచి మొదలు పెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవాలనే మంచి ఆలోచనతో సీఎం ముందుకెళ్తున్నారు. కేవలం దళితులకే కార్యక్రమం.. మిగతావారికి చేయం అని చెప్పడం లేదు. క్రమంగా మిగతా వర్గాలకూ దళితబంధు తరహా పథకం అమలు చేస్తాం.
పేరుకు వంద కులాలు ఉన్నా.. ప్రపంచంలో రెండే రెండు కులాలు ఉన్నాయి. అవి పైసలు ఉన్నోని కులం.. లేనోని కులం.. ఈ లేని వాళ్లను ఒక్కో మెట్టు ఎక్కిస్తూ ఆర్థికంగా స్థితిమంతులను చేయాలి. తద్వారా రాష్ట్రానికి కూడా ఆర్థికంగా లబ్ధి చేకూరేలా ప్రయత్నం చేస్తున్నాం. నేను మీ అందరినీ కోరేది ఒక్కటే. ఇప్పటికే జిల్లా కలెక్టర్కు చెప్పాను. ఎట్టిపరిస్థితుల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలో హార్వెస్టర్లు, ట్రాక్టర్లు కొంటానంటే.. అవి పంచేందుకు నేను రాను. మీతో ఫొటోలు దిగే ఆసక్తి నాకు లేదు. కానీ, అన్నా.. నేను వ్యాపారం చేస్తాను.. మీరు కొబ్బరికాయ కొట్టాలి అంటే తప్పకుండా వస్తాను. మీకు కావాల్సిన సాయం చేసేందుకు ప్రయత్నిస్తాను. వారికే ఇస్తున్నారని.. దళిత సమాజాన్ని అసూయతో చూడాల్సిన అవసరం లేదు. ఒక సమాజాన్ని ఆర్థికంగా సమూలంగా మార్చేసే ఆలోచిన ఇది. ప్రతి ఒక్కరూ దళిత జాతి కోసం.. దళిత జాతి ఉద్ధరణ కోసం పాటుపడాలి. ప్రజా జీవితం చాలా చిన్నది. ప్రజలు అవకాశం ఇచ్చారు. ఈ పథకం అమలులో ప్రజాప్రతినిధులు భాగం కావాలి. అప్పుడే విజయవంతం అవుతాం’’ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!