ప్రభుత్వాసుపత్రికి ఉయ్యాలలు.. కేటీఆర్‌ ప్రశంసలు

చిన్నారుల కోసం అధునాతన ఉయ్యాలలు తయారు చేసి సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి అందజేసిన టీ వర్క్స్‌ బృందాన్ని మంత్రి కేటీఆర్‌ అభినందించారు. ఆసుపత్రిలోని చిన్నపిల్లల విభాగం కోసం....

Published : 09 Feb 2021 11:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చిన్నారుల కోసం అధునాతన ఉయ్యాలలు తయారు చేసి సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి అందజేసిన టీ వర్క్స్‌ బృందాన్ని మంత్రి కేటీఆర్‌ అభినందించారు. ఆసుపత్రిలోని చిన్నపిల్లల విభాగం కోసం నూతన ఉయ్యాలలు రూపొందించిన బృందాన్ని మంత్రి ప్రశంసించారు. నట్లు, బోల్టుల వినియోగం లేకుండా.. సులభంగా ఉపయోగించేలా అధునాతన ఉయ్యాలలు తయారుచేయడం హర్షనీయమన్నారు. ఆసుపత్రుల్లో చిన్నపిల్లల విభాగాలకు సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూడు వేల ఉయ్యాలలను ఆర్డర్‌ చేసినట్లు కేటీఆర్‌ పేర్కొన్నారు. పసిపిల్లలకు బెడ్‌ మాదిరిగా ఉయ్యాలను రూపొందించడం సహా ఒక స్థానం నుంచి మరో స్థానానికి సులువుగా తీసుకెళ్లేలా వాటిని తయారుచేశారు.

ఇవీ చదవండి...

ముఖ్యమంత్రి ప్రయాణ దారిలో చీకట్లు!

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఎఫెక్ట్‌: 90% మందికి నొప్పులే!

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని