Sood - KTR : సోనూనే సూపర్ హీరో: కేటీఆర్
కరోనా సంక్షోభ సమయంలో కష్టాల్లో ఉన్నవారికి సాయం చేస్తూ సినీనటుడు సోనూసూద్ రియల్ హీరోగా నిలుస్తున్నారు. తాజాగా ఆయన్ను తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సైతం సూపర్ హీరో అంటూ కొనియాడారు
మంత్రి ట్వీట్పై స్పందించిన నటుడు
హైదరాబాద్: కరోనా సంక్షోభ సమయంలో కష్టాల్లో ఉన్నవారికి సాయం చేస్తూ సినీనటుడు సోనూసూద్ రియల్ హీరోగా నిలుస్తున్నారు. తాజాగా ఆయన్ను తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సైతం సూపర్ హీరో అంటూ కొనియాడారు. తాము అడగ్గానే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను సమకూర్చి సాయం చేసిన కేటీఆర్ను నిజమైన సూపర్ హీరో అంటూ నందకిశోర్ అనే వ్యక్తి ట్విటర్లో ప్రశంసించగా.. దానికి మంత్రి స్పందించారు. ఈ సందర్భంగా కేటీఆర్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఎన్నికైన ప్రజాప్రతినిధిగా తన వంతు బాధ్యతను నిర్వర్తించినట్టు కేటీఆర్ తెలిపారు. సోనూసూద్ను సూపర్ హీరోగా పిలవడం సరైనదంటూ పేర్కొన్నారు. అంతేకాకుండా తన ట్వీట్కు సోనూసూద్ని ట్యాగ్ చేశారు. ఆపదలో ఉన్నవాళ్లకు ‘మీరూ సాయం చేయండి బ్రదర్’ అంటూ ఆ వ్యక్తికి కేటీఆర్ సూచించారు.
తెలంగాణ నా రెండో ఇల్లు
కేటీఆర్ ట్వీట్పై సోనూసూద్ స్పందించారు. తన గురించి చేసిన వ్యాఖ్యలకు కృతజ్ఞతలు తెలిపారు. కానీ తెలంగాణకు ఎంతో చేస్తున్న మీరే నిజమైన హీరో అంటూ కేటీఆర్ను సోనూ కొనియాడారు. మీ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. తెలంగాణను తన రెండో ఇల్లుగా భావిస్తానని, అక్కడి ప్రజలు ఎన్నో ఏళ్లుగా తనపై ప్రేమను చూపుతున్నారంటూ ట్వీట్ చేశారు.
మరోవైపు, కరోనాతో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల వల్ల అనేకమంది ప్రజలు సాయం కోసం సామాజిక మాధ్యమాలను ఓ మంచి వేదికగా వినియోగించుకుంటున్నారు. ఔషధాలు, ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్, వ్యాక్సిన్లు.. ఇలా ఏ అవసరం ఉన్నా ట్వీట్లు చేస్తూ వాటికి పలు రంగాల ప్రముఖులను ట్యాగ్ చేస్తున్నారు. దీంతో వారు సకాలంలో స్పందించి తగిన సాయం అందిస్తుండటం ద్వారా ఎంతోమందికి ప్రాణదాతలుగా నిలుస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!