KTR: కేంద్రానికి థాంక్స్‌.. ఆ సిఫార్సులను కూడా గౌరవిస్తే బాగుంటుంది: కేటీఆర్‌

‘మిషన్‌ భగీరథ’ పథకానికి కేంద్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించడపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఆనందం వ్యక్తం..

Updated : 29 Sep 2022 13:58 IST

హైదరాబాద్‌: ‘మిషన్‌ భగీరథ’ పథకానికి కేంద్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించడపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని గ్రామీణ ఆవాసాలకు సురక్షిత తాగునీరు సరఫరా చేస్తున్న విషయాన్ని గుర్తించడంపై కేంద్ర ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. అయితే మిషన్‌ భగీరథకు రూ.19వేల కోట్లు ఇవ్వాలన్న నీతి ఆయోగ్‌ సిఫార్సులను ఎన్డీయే ప్రభుత్వం గౌరవిస్తే ఇంకా బాగుంటుందని ఆయన పేర్కొన్నారు. 

తెలంగాణలో ఇంటింటికీ మంచినీటిని అందిస్తున్న మిషన్‌ భగీరథకు కేంద్ర ప్రభుత్వ జల్‌జీవన్‌ మిషన్‌ పురస్కారం లభించింది. ఈ పథకం.. నాణ్యత, పరిమాణంలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని, అన్ని గ్రామాలలో ఇంటింటికీ నల్లా కనెక్షన్ల ద్వారా రోజూ నాణ్యమైన తాగునీరు అందిస్తున్నట్లు గుర్తించి పురస్కారానికి ఎంపిక చేసినట్లు కేంద్రం తెలిపింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ పంపింది. అక్టోబరు 2న దిల్లీలో పురస్కారం అందుకోవాలని ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని