KTR: ప్రజల కోసం ప్రయోగించిన బ్రహ్మాస్త్రం ధరణి పోర్టల్: కేటీఆర్
శరవేగంగా పరుగులు పెడుతున్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఆధునిక సంస్కరణలే పునాదిరాళ్లు అని మంత్రి కేటీఆర్ అన్నారు. టీఎస్ ఐపాస్ విధానంతో పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామమైందని కొనియాడారు.

హైదరాబాద్: శరవేగంగా పరుగులు పెడుతున్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఆధునిక సంస్కరణలే పునాదిరాళ్లు అని మంత్రి కేటీఆర్ అన్నారు. టీఎస్ ఐపాస్ విధానంతో పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామమైందని కొనియాడారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సుపరిపాలన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఉద్దేశించి కేటీఆర్ ట్వీట్ చేశారు.
‘‘భూమి చుట్టూ అల్లుకున్న సవాలక్ష చిక్కుముళ్లను విప్పేందుకు ప్రజల కోసం ప్రయోగించిన బ్రహ్మాస్త్రం ధరణి పోర్టల్. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ నుంచి నూతన కలెక్టరేట్ల నిర్మాణం వరకు.. తండాలు, గ్రామ పంచాయతీల నుంచి నూతన రెవెన్యూ డివిజన్లు, మండలాలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల వరకూ తెలంగాణలో తీసుకొచ్చిన ప్రతి సంస్కరణ భవిష్యత్ తరాలకు వెలకట్టలేనిది’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ODI WC 2023: ఈ వరల్డ్ కప్లో వారిద్దరే స్పెషల్: గౌతమ్ గంభీర్
-
NASA: 2040 నాటికి చంద్రుడిపై 3డీ ఇళ్ల నిర్మాణం.. ప్రణాళికలు సిద్ధం చేస్తున్న నాసా
-
Prisoners: నేరస్థులుగా వచ్చి.. గ్రాడ్యుయేట్లుగా బయటికి
-
మధ్యప్రదేశ్ అత్యాచార ఘటన.. నిందితుడి ఇంటిపైకి బుల్డోజర్..!
-
World bank: భారత వృద్ధి 6.3%.. ప్రపంచబ్యాంక్ వెల్లడి.. ద్రవ్యోల్బణ అంచనాలు పెంపు
-
Elon musk: మస్క్లోని ఆ లక్షణాలే వ్యాపారంలో విజయానికి.. మా విడాకులకు కారణం: జస్టిన్ మస్క్