వరద ప్రభావిత ప్రాంతాల్లో కేటీఆర్ పర్యటన
నగరంలోని బైరామల్ గూడ కాలనీలో వరద ప్రభావిత ప్రాంతాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ పరిశీలించారు. హోం మంత్రి మహమూద్ అలీ, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్రెడ్డితో ...
హైదరాబాద్: నగరంలోని బైరామల్ గూడ కాలనీలో వరద ప్రభావిత ప్రాంతాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ పరిశీలించారు. హోం మంత్రి మహమూద్ అలీ, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్రెడ్డితో కలిసి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షించారు. కాలనీల్లో నిలిచిన నీరు త్వరగా పోయేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బైరామల్గూడ కాలనీ సమస్యలపై ప్రజలతో మాట్లాడారు. ముంపు ప్రాంతాల్లో ఇబ్బందులను స్థానికులు.. మంత్రి కేటీఆర్, అధికారులకు వివరించారు. ముంపునకు గురైన ఓ నివాసంలోకి వెళ్లి బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, స్థానిక కార్పొరేటర్లకు కేటీఆర్ పలు సూచనలు చేశారు. ఆ తర్వాత అంబర్పేట, రామంతాపూర్ చెరువు, హబ్సిగూడలోని వరద ప్రభావిత ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించారు. బాధితులను ఆదుకుంటామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు.
మరోవైపు నగరంలోని టోలిచౌకిలోనూ మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో కలిసి టోలిచౌకి నదీంకాలనీలో జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ సహాయచర్యలను పర్యవేక్షించారు. షాతం చెరువుకు వరద నీరు వెళ్లాల్సిన నాలా కుంచించుకుపోయిందని.. అందువల్లే నదీంకాలనీకి వరద ముంచెత్తిందని స్థానికులు కేటీఆర్కు తెలిపారు. నీట మునిగిన కాలనీల్లో ఉన్నవారిని బయటకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. టోలిచౌకి పర్యటనలో భాగంగా షాతం చెరువును పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కేటీఆర్ వాహనం చెరువు వద్దకు వెళ్ళలేకపోయింది. దీంతో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆయన వాహనంలో కేటీఆర్ను తీసుకెళ్లి చెరువును పరిశీలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ