Lalu Prasad Yadav: ఇప్పటికీ డ్రైవింగ్‌ సీట్‌లోనే ఉన్నానంటూ.. జీపు నడిపిన లాలూ..!

బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ డ్రైవర్‌గా మారారు.

Published : 25 Nov 2021 01:54 IST

పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ డ్రైవర్‌గా మారారు. కార్యకర్తలతో కలిసి పట్నా వీధుల్లో జీపులో షికారు చేశారు. తనకు ఆరోగ్యం క్షీణించినా.. ఇప్పటికీ రాజకీయంగా తాను డ్రైవింగ్ సీట్‌లోనే ఉన్నాననే సందేశాన్ని కార్యకర్తలకు పంపారు. తన భార్య రబ్రీదేవి భవనం చుట్టుపక్కల ఉన్న వీధుల్లో ఓపెన్ టాప్ జీపును లాలూ నడిపారు. డ్రైవింగ్ చేస్తున్న లాలూను చూసి ఆశ్చర్యానికి గురైన ప్రజలు.. ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని