Kiren Rijiju: ‘బాటిల్ క్యాప్ ఛాలెంజ్’లో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు.. వీడియో చూశారా?
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఎప్పటికప్పుడు ఫిట్నెస్ వీడియోలను పోస్ట్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటారనే విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆయన మరోసారి ‘బాటిల్ క్యాప్ ఛాలెంజ్’లో
దిల్లీ: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఎప్పటికప్పుడు ఫిట్నెస్ వీడియోలను పోస్ట్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటారనే విషయం తెలిసిందే. తాజాగా ఆయన మరోసారి ‘బాటిల్ క్యాప్ ఛాలెంజ్’లో పాల్గొన్నారు. సంబంధిత వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా అది వైరల్గా మారింది.
ఏంటీ బాటిల్ క్యాప్ ఛాలెంజ్?
తైక్వాండో శిక్షకుడు, ఫైటర్ ఫరాబీ డావ్లెట్చిన్ (Farabi Davletchin) బాటిల్ని కింద పడగొట్టకుండా ఒకే కిక్తో దాని క్యాప్ను తెరిచే వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో ఇది 2019లో సోషల్ మీడియా మొత్తంలో ‘బాటిల్ క్యాప్ ఛాలెంజ్’ పేరిట బాగా ట్రెండ్ అయ్యింది. ప్రముఖులు ఈ ఛాలెంజ్ని స్వీకరించి తమ టాలెంట్ను ప్రదర్శించారు. ఈ ఛాలెంజ్లో భాగంగా తొలుత ఓ బాటిల్ను టేబుల్పై పెట్టి దానికి ఉన్న మూతను కాస్త వదులుగా ఉంచుతారు. బాటిల్ కిందపడకుండా దాని క్యాప్ను కాలితో తెరవాలి. అయితే, అప్పుడు కూడా ఈ ఛాలెంజ్ స్వీకరించిన కిరణ్ రిజిజు.. దాన్ని తెరిచి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తాజాగా మరోసారి ఈ ఛాలెంజ్లో పాల్గొని బాటిల్ మూత తెరిచారు. కానీ, తేడా ఏంటంటే..? ఈసారి ప్లాస్టిక్ బాటిల్కు బదులు గాజు సీసాను వాడారు. ఈ వీడియోను షేర్ చేస్తూ.. ‘ఫిట్నెస్ అనేది వన్ టైమ్ ఎఫర్ట్ కాదు.. లైఫ్ టైమ్ హాబిట్’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరి!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ