జూమ్కాల్లో భోజనం.. విస్తుపోయిన సొలిసేటర్!
కరోనా.. లాక్డౌన్ నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్.. జూమ్ కాల్స్ మీటింగ్స్ పెరిగిన విషయం తెలిసిందే. అయితే, ఇంట్లోనే ఉండి జూమ్కాల్స్లో పాల్గొంటున్న వారి వల్ల కొన్ని సరదా సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ మధ్య ఓ ఫ్రొఫెసర్ వీడియోకాల్లో జీఎస్టీపై ఎంతో సీరియస్గా ప్రసంగిస్తున్న
పట్నా: కరోనా.. లాక్డౌన్ నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్.. జూమ్ కాల్స్ మీటింగ్స్ పెరిగిన విషయం తెలిసిందే. అయితే, ఇంట్లోనే ఉండి జూమ్కాల్స్లో పాల్గొంటున్న వారి వల్ల కొన్ని సరదా సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ మధ్య ఓ ఫ్రొఫెసర్ వీడియోకాల్లో జీఎస్టీపై ఎంతో సీరియస్గా ప్రసంగిస్తున్న సమయంలో ఆయన సతీమణి వచ్చి ముద్దు పెట్టబోయిన ఘటన నెట్టింట్లో హల్చల్ చేసింది. తాజాగా.. ఓ న్యాయవాది జూమ్కాల్ కొనసాగుతుండగానే భోజనం చేస్తూ ఏకంగా సొలిసేటర్ జనరల్ ఆఫ్ ఇండియా కంటపడ్డాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్గా మారింది.
గతకొంత కాలంగా కోర్టు విచారణలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే జరుగుతున్నాయి. ఈ క్రమంలో బిహార్లోని పట్నాకు చెందిన న్యాయవాది కేసు విచారణలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నాడు. ఈ కాన్ఫరెన్స్లో సొలిసేటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా కూడా ఉన్నారు. అయితే, తన వాదనలు పూర్తయిన తర్వాత ఆ న్యాయవాది జూమ్కాల్ వీడియో ఆఫ్ చేయకుండా కెమెరా ముందే ప్లేట్ పట్టుకొని భోజనం చేయడం మొదలుపెట్టాడు. అది చూసిన తుషార్ మెహతా విస్తుపోయారు. కెమెరా ఆన్లోనే ఉందని చెప్పడానికి ప్రయత్నించారు. కానీ, అది న్యాయవాదికి వినపడలేదు. చివరికి తుషార్ మెహతా అతడి పర్సనల్ ఫోన్కి కాల్ చేసి పరిస్థితి వివరించారు. దీంతో కంగుతిన్న న్యాయవాది ప్లేటు పక్కన పెట్టి.. బిక్కముఖం వేసుకొని కూర్చున్నాడు. ఎస్జీఐ తుషార్ మెహతా మాట్లాడుతూ.. ఆ భోజనం తనకూ పంపమని సరదాగా వ్యాఖ్యానించారు. మరోవైపు జూమ్కాల్లో ఉన్న మిగతా సభ్యులు న్యాయవాది చేసిన పనికి పగలబడి నవ్వారు. ఆ వీడియోను మీరూ చూసేయండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)