Kidney Disease: కాళ్లవాపు వస్తే కిడ్నీ జబ్బు ఉన్నట్టేనా..? నిజమెంతో తెలుసుకోండి..!
నడుంనొప్పి వస్తే చాలు కిడ్నీ జబ్బు వచ్చిందని, అందులో రాళ్లు ఉన్నాయని భయపడుతాం.
ఇంటర్నెట్ డెస్క్: నడుంనొప్పి వస్తే చాలు కిడ్నీ జబ్బు వచ్చిందని, అందులో రాళ్లు ఉన్నాయని భయపడతాం. అలాగే మూత్రం రంగు మారితే, కాళ్ల వాపు వస్తే కిడ్నీలు పాడైనట్టు అనుమానిస్తాం. ఇందులో కొంత నిజం లేకపోలేదని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో ఏ మార్పు వచ్చినా జాగ్రత్తగా గమనించాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రమాదం బారిన పడే వీలుంది. కొన్నిరకాల జబ్బుల్లోనూ కాళ్ల వాపు వస్తుందని ప్రముఖ నెఫ్రాలజిస్టు డాక్టర్ శ్రీభూషణ్ రాజు వివరించారు.
జాగ్రత్త తప్పనిసరి..
నడుం నొప్పి ఉంటే.. కిడ్నీ సమస్యే ఉండనక్కర లేదు. కిడ్నీ జబ్బు నడుంనొప్పి రూపంలో రాదు. రాళ్లున్నప్పుడు నొప్పి ఉంటుంది. కానీ భరించలేనంతగా ఉంటుంది. అప్పుడే వైద్యులను కలుసుకోవాలి. మూత్రం రంగు మారినా భయపడాల్సిన అవసరం లేదు. మూత్రం వాసన రావడం కూడా జబ్బు లక్షణం కాదు. కాళ్లవాపు కిడ్నీ సమస్యల్లోని ఒక లక్షణం. అందరికీ కాళ్లవాపు రావాలని కూడా లేదు. ప్రోటీన్ పోవడంతో వాపు కనిపిస్తుంది. గుండె కొట్టుకునే తీరులో మార్పు వచ్చినపుడు కొంత వాపు కనిపిస్తుంది. ఎక్కువ రోజులు కాళ్లవాపు ఉంటే వైద్యుల దగ్గరికి వెళ్లాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు