ఇవి పాటిస్తే.. 9 క్యాన్సర్లకు దూరంగా ఉండొచ్చు!
క్యాన్సర్లలో జన్యువుల కన్నా మన ఆహార విహారాల పాత్రే ఎక్కువ. పది క్యాన్సర్లలో జన్యుపరంగా తలెత్తేది ఒకటే. మిగతా 9 క్యాన్సర్లకు
క్యాన్సర్లలో జన్యువుల కన్నా మన ఆహార విహారాల పాత్రే ఎక్కువ. పది క్యాన్సర్లలో జన్యుపరంగా తలెత్తేది ఒకటే. మిగతా 9 క్యాన్సర్లకు జీవనశైలే ప్రధాన కారణం. అందుకే అధ్యయనాలు జీవనశైలి మార్పులకే అధికంగా ప్రాధాన్యం ఇస్తున్నాయి. క్యాన్సర్ల నివారణకు ఆహార, విహారాలు ఎలా తోడ్పడతాయో తాజా పరిశోధనలు మరోసారి వివరిస్తున్నాయి.
వ్యాయామ రక్ష
క్రమం తప్పకుండా వ్యాయామం చేసే రొమ్ముక్యాన్సర్ బాధితులకు క్యాన్సర్ తిరగబెట్టటం, మరణించే ముప్పు తగ్గుతున్నట్టు ఇటలీ పరిశోధన పేర్కొంటోంది. వ్యాయామం మూలంగా ఒంట్లో క్యాన్సర్తో పోరాడే అణువుల పనితీరు పుంజుకుంటున్నట్టు, క్యాన్సర్ కారక అణువులు నిర్వీర్యమవుతున్నట్టు తేలింది. క్యాన్సర్ల నివారణకు వ్యాయామం ఎంతగానో ఉపయోగపడగలదని ఇది చెప్పకనే చెబుతోంది. క్యాన్సర్ను ఎదుర్కొనే అణువుల పనితీరును పెంపొందించే మందుల తయారీకి కూడా అధ్యయన ఫలితాలు తోడ్పడగలవని భావిస్తున్నారు.
ఆహార బలం
పెద్దపేగు క్యాన్సర్ వంటి కొన్నిరకాల క్యాన్సర్లకూ ఆహారానికీ సంబంధం ఉండటం ఇప్పటికే తెలుసు. కెనడా పరిశోధకులు వీటి జాబితాలో ప్రొస్టేట్ క్యాన్సర్నూ చేర్చారు. పండ్లు, కూరగాయలు, వృక్ష సంబంధ ప్రొటీన్తో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం తినేవారితో పోలిస్తే.. ఉప్పు, మాంసం, మద్యం, గంజి ఎక్కువగా ఉండే పిండి పదార్థాలు, తీపి పానీయాలు అధికంగా తీసుకునేవారికి ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పు పెరుగుతున్నట్టు బయటపడింది. వయసు, జాతి, కుటుంబ చరిత్ర, తరచూ ముందస్తు పరీక్షల వంటి వాటితో నిమిత్తం లేకుండానే ఈ క్యాన్సర్ ముప్పు పొంచి ఉంటున్నట్టు తేలడం గమనార్హం. అయితే ఆరోగ్యకరమైన ఆహారం తినేవారికి ఇతరత్రా మంచి అలవాట్లు సైతం ఉండొచ్చనే విషయాన్నీ మరవరాదని పరిశోధకులు గుర్తుచేస్తున్నారు.
దంత శుభ్రత అండ
రోజూ సన్నటి తాడుతో దంతాల సందులను శుభ్రం చేసుకోవటం (ఫ్లాసింగ్) నోటి శుభ్రతకే కాదు.. జీర్ణాశయ, అన్నవాహిక క్యాన్సర్ల నివారణకూ తోడ్పడుతుంది. హార్వర్డ్ విశ్వవిద్యాలయం 22 ఏళ్ల పాటు నిర్వహించిన అధ్యయనం ఈ విషయాన్నే నొక్కి చెబుతోంది. పురుషుల్లో చిగుళ్లవాపు గల ప్రతి 65 మందిలో ఒకరు జీర్ణాశయ క్యాన్సర్.. ప్రతి 87 మందిలో ఒకరు అన్నవాహిక క్యాన్సర్ బారినపడ్డట్టు పరిశోధకులు గుర్తించారు. దీనికి కారణం నోటిలోని బ్యాక్టీరియా కావొచ్చని భావిస్తున్నారు. స్త్రీలకు ఇలాంటి క్యాన్సర్లు వచ్చే అవకాశం తక్కువే గానీ చిగుళ్లవాపుతో దంతాలు ఊడిపోవటం వంటి సమస్యలు పొంచి ఉంటాయని తెలుసుకోవాలి. ఫ్లాసింగ్తో దంతాల మధ్య బ్యాక్టీరియా తొలగిపోతుంది. దీంతో చిగుళ్లవాపు, దంతాలు ఊడటం వంటి సమస్యలు దరిజేరవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాలతో నిఘా: సీఈవో మీనా
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. -
ఆన్లైన్లోనూ నామినేషన్ వేయొచ్చు: వికాస్ రాజ్
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్లైన్లోనూ నామినేషన్ దాఖలు చేయవచ్చని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
వేసవిలో తాగునీటి అవసరాల కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవ వేడుకతో గురువారం భద్రగిరి దివ్యక్షేత్రం పులకించింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు భక్తకోటికి నేనున్నానంటూ కొండంత అభయమిచ్చాడు. -
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
సీఎం జగన్పై రాయి దాడి వ్యవహారంపై విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం ఈ పిటిషన్ వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
-
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కోహ్లీకి అరుదైన గౌరవం.. జైపుర్ మ్యూజియంలో మైనపు విగ్రహం
-
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
-
102 స్థానాలు.. 16 కోట్ల మంది ఓటర్లు.. తొలిదశ పోలింగ్కు సర్వం సిద్ధం