AP News: బ్లాక్‌ఫంగస్‌కు చికిత్స ఈ ఆస్పత్రుల్లోనే..

కరోనా నుంచి కోలుకున్న తర్వాత కొందరిలో బ్లాక్‌ఫంగస్‌ లక్షణాలు బయటపడుతుండటం కలవర పెడుతోంది. ఏపీలోనూ బ్లాక్‌ ఫంగస్‌ కేసులు వెలుగు చూస్తుండటంతో....

Updated : 20 May 2021 17:28 IST

అమరావతి: కరోనా నుంచి కోలుకున్న తర్వాత కొందరిలో బ్లాక్‌ఫంగస్‌ లక్షణాలు బయటపడుతుండటం కలవరపెడుతోంది. ఏపీలోనూ బ్లాక్‌ ఫంగస్‌ కేసులు వెలుగు చూస్తుండటంతో దీనికి చికిత్సను రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ట్రస్టు పరిధిలోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యాధి సోకిన వారికి ఉచితంగా చికిత్స అందించేందుకు వీలుగా బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. అయితే, రాష్ట్రవ్యాప్తంగా బ్లాక్‌ఫంగస్‌కు 17 ఆస్పత్రుల్లో చికిత్స అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ఆస్పత్రుల జాబితాను గురువారం విడుదల చేసింది. 

ఆ ఆస్పత్రుల జాబితా ఇదే..

1. జీజీహెచ్‌ అనంతపురం (ప్రభుత్వ వైద్య కళాశాల)

2. ఎస్వీఆర్‌ఆర్‌జీజీహెచ్‌, తిరుపతి

3. స్విమ్స్‌, తిరుపతి

4. జీజీహెచ్‌, కాకినాడ (రంగరాయ మెడికల్‌ కళాశాల)

5. జీజీహెచ్‌ గుంటూరు (ప్రభుత్వ వైద్య కళాశాల)

6. జీజీహెచ్‌ (రిమ్స్‌) కడప

7. జీజీహెచ్‌, విజయవాడ

8. ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆస్పత్రి, కర్నూలు

9.జీజీహెచ్‌, కర్నూలు

10. జీజీహెచ్‌ (రిమ్స్‌) ఒంగోలు

11. జీజీహెచ్‌, నెల్లూరు (ఎసీఎస్‌ఆర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల)

12. జీజీహెచ్‌ శ్రీకాకుళం (ప్రభుత్వ వైద్య కళాశాల)

13. ప్రభుత్వ ఈఎన్‌టీ ఆస్పత్రి, విశాఖపట్నం

14. ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆస్పత్రి, విశాఖపట్నం

15. ప్రభుత్వ ఛాతి వ్యాధుల ఆస్పత్రి (ఆంధ్రా వైద్య కళాశాల)

16. కేజీహెచ్‌, విశాఖపట్నం

17. విమ్స్‌, విశాఖపట్నం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని