Telangana news: ఎలుగు సంచారం.. ఆందోళనలో గ్రామస్థులు..

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తిలో ఎలుగుబంటి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది.

Updated : 31 Mar 2022 15:42 IST

కరీంనగర్‌: కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తిలో ఎలుగుబంటి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. సమీప ప్రాంతాల్లో ఎలుగుబంటి సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. గ్రామానికి సమీపంలోని మామిడి తోటలో ఇది తిరుగుతోందని, కాలనీలోకి కూడా వస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఈ అంశంపై సమాచారం అందుకుని ఎలుగుబంటి తిరుగుతున్నట్లు గుర్తించామని కొత్తపల్లి ఎస్సై ఎల్లయ్యగౌడ్‌ తెలిపారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందిస్తామని ఆయన పేర్కొన్నారు. భల్లూకం నుంచి తమను రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు